
అందాల ముద్దుగుమ్మ నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఒకప్పుడు తెలుగులో వరసగా చాన్స్ లు అందుకుంటూ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేసి మంచి ఫేమ్ సంపాదించుకుంది.

అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది నిత్యా మీనన్. మొదటి సినిమా పర్వాలేదు అనిపించడం, ఈ అమ్మడు కూడా తన గ్లామర్ తో కుర్రకారును మాయ చేయడంతో తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరసగా ఆఫర్స్ వచ్చాయి.

ముఖ్యంగా ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ చాలా తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ ఇష్క్ సినిమాతో యూత్ ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. ఈ మూవీలో ఈ అమ్మడు నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. అంతే కాకుండా నితిన్, నిత్యామీనన్ కాంబోలో సినిమా వస్తే హిట్టే అనే టాక్ ఉండేది.

ఈ మూవీ తర్వాత వీరి కాంబోలో గుండె జారీ గల్లంతయ్యింది ఇలా చాలా సినిమాలే వచ్చాయి. ఇక ఈ అమ్మడు గ్లామర్ పాత్రలు దూరంగా ఉంటూ, మంచి పాత్రలను ఎంచుకొని చాలా భాషల్లో తన నటనతో మెప్పించింది. ఎన్నో అవార్డ్స్ కూడా అందుకుంది.

టాలీవుడ్ కు కాస్త దూరమైన ఈ అమ్మడు తాజాగా సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఈ బ్యూటీ చాలా అందంగా కనిపిస్తుంది. కానీ కొన్ని సెల్ఫీ ఫొటోలు షేర్ చేయగా, అందులో ఒక ఫొటో అసభ్యకరంగా ఉంది, దీంతో నెటిజన్స్ ఏంటీ నిత్యా అలాంటి బ్యాగ్రౌండ్ ఉన్న దగ్గర సెల్ఫీ దిగాలా అంటూ ఫైర్ అవుతున్నారు.