Disha Patani: సౌత్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన దిశ పాట్నీ కెరీర్లో ఇప్పుడిప్పుడే హై మూమెంట్స్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లోనే నటించటంతో దిశకి పెద్దగా క్రేజ్ రాలేదు.
కానీ ఇప్పుడు డిఫరెంట్ మూవీస్ చేసే అవకాశాలు వస్తుండటంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఈ ఉత్తరాది భామ.వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన లోఫర్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన గ్లామరస్ బ్యూటీ దిశ పాట్నీ.
అయితే సౌత్లో సక్సెస్ రాకపోవటంతో నార్త్కు షిప్ట్ అయిన ఈ బ్యూటీ, కెరీర్ స్టార్టింగ్లో ఇంట్రస్టింగ్ మూవీస్ చేశారు. ధోని బయోపిక్, కుంగ్ఫూ యోగా లాంటి సినిమాలు దిశకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
కానీ నెమ్మది గ్లామర్ రోల్స్కు షిఫ్ట్ అవ్వటంతో దిశ కెరీర్ స్లో అయ్యింది. వరుసగా యాక్షన్ స్టార్స్తో జోడి కట్టడంతో ఏ సినిమాలోనూ పర్ఫామెన్స్కు పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. వరుస అవకాశాలు వస్తున్నా..
హీరోయిన్గా బిజీ అన్న రేంజ్లో ఆఫర్స్ మాత్రం రాలేదు.ఓ వైపు తన కాంటెంపరరీ హీరోయిన్స్ కృతి సనన్, కియారా అద్వానీ స్టార్ ఇమేజ్తో పాటు వరుస అవకాశాలతో దూసుకుపోతుంటే. దిశ మాత్రం కమర్షియల్ హీరోయిన్గా అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చారు.
అందుకే మూవీ సెలక్షన్ విషయంలో స్ట్రాటజీ మార్చారు దిశ పాట్నీ.ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న సినిమాలు తన కెరీర్ను మలుపు తిప్పుతాయన్న నమ్మకంతో ఉన్నారు దిశ.
సిద్ధార్థ్కు జోడిగా నటిస్తున్న యోధా, విమెన్ సెంట్రిక్ కథతో తెరకెక్కుతున్న కే టీనా సినిమాలు తన ఇమేజ్ను మార్చేస్తాయన్న కాన్ఫిడెన్స్తో ఉన్నారు.
అంతేకాదు పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే, సూర్య 42 సినిమాల మీద కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు దిశ పాట్నీ.
పాన్ ఇండియా లెవల్ లో దిశ రేంజ్ మారిందా..?