హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ ఎందుకు సైలెంట్ అయ్యారు..? అంత పెద్ద విజయం వచ్చిన తర్వాత.. కాన్పిడెన్స్తో పాటు కన్ఫ్యూజన్ కూడా వచ్చిందా..? బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్తో అనుకున్న ప్రాజెక్ట్ ఏమైంది..? సోషల్ మీడియాలో నడుస్తున్నట్లు ఈ ప్రాజెక్ట్ నిజంగానే ఆగిపోయిందా..? ఒకవేళ ఆగిపోకపోతే దాని స్టేటస్ ఏంటి..?
ప్రశాంత్ వర్మ.. హనుమాన్ సినిమాతో ఈయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. తేజ సజ్జా లాంటి హీరోతో ఏకంగా 300 కోట్ల సినిమా ఇచ్చిన ఈయన కాన్ఫిడెన్స్కు బాలీవుడ్ హీరోలు సైతం బెండ్ అయిపోయారు. ప్రస్తుతం రణ్వీర్ సింగ్తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్.
దీని ప్రోమో షూట్ హైదరాబాద్లోనే జరుగుతుంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఓ వైపు జై హనుమాన్ పనులు చూసుకుంటూనే.. మరోవైపు రణ్వీర్ సింగ్ సినిమాను కూడా లైన్లో పెట్టారు ప్రశాంత్ వర్మ.
అయితే ఈ చిత్రం ఆగిపోయిందని.. చివరి నిమిషంలో దర్శక నిర్మాతలతో రణ్వీర్కు సెట్ అవ్వక ఈ సినిమా నుంచి బయటికి వచ్చేసారని వార్తలు వచ్చాయి. కానీ అదంతా అబద్ధం.. ప్రాజెక్ట్ ఈజ్ ఆన్.. రూమర్స్ నమ్మొద్దంటున్నారు ప్రశాంత్ వర్మ టీం.
ప్రశాంత్ వర్మ, రణ్వీర్ సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్ వర్మ టీం. దీనికి రాక్షస అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. భారీ బడ్జెట్తో విజువల్ వండర్గా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ వర్మ. ఆగిపోలేదు అని దర్శక నిర్మాతలు చెప్తున్నా.. నిప్పు లేనిదే పొగరాదుగా అనే వాళ్లున్నారు. మరి వాళ్లకు ప్రశాంత్ వర్మ టీం ఎలాంటి ప్రూఫ్స్ చూపిస్తుందో చూడాలి.