
స్టార్ హీరోయిన్ సమంతకు సంబంధించిన అనేక వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ముంఖ్యంగా నాగచైతన్య, సమంత ప్రేమ వివాహం చేసుకొని, పెళ్లైన నాలుగు సంవత్సరాలకే ఇద్దరీ అంగీకారంతో విడాకులు తీసుకొని విడిపోయిన విషయం తెలిసిందే. వీరి డివోర్స్ తర్వాత అటు చైతూ, ఇటు సామ్కు సంబంధించిన అనేక గాసిప్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.

ముఖ్యంగా సమంతకు సంబంధించిన ప్రతి చిన్న విషయం ఎక్కువగా ట్రోల్ అవుతుంటుంది. ఇక మయోసైటీస్ వ్యాధి బారిన పడిన సామ్, రెండు సంవత్సరాల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్లో, హాలీవుడ్లో వెబ్ సిరీస్లతో ఫుల్ బిజీ అయిపోయింది.

దీంతో తెలుగు అభిమానులు, టాలీవుడ్లో కూడా సినిమాలు చేయాలని కోరడంతో, త్వరలో వచ్చేస్తున్నానంటూ హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ బ్యూటీ, సొతంగా,త్రేలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించింది. అయితే ఇందులోనే మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తుంది. ఈ మూవీకి నందిని రెడ్డి దర్శకత్వం వహించగా, సమంత కీలక పాత్రలో నటిస్తోంది.

ఇక నందిని రెడ్డి, సమంత మంచి స్నేహితులు. వీరు వీలైనప్పుడు కలిసి పార్టీలు చేసుకుంటారు. అయితే తాజాగా దర్శకురాలు నందిని రెడ్డి సమంతకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ తెలిపింది. సామ్ డేరింగ్ స్టెప్ తీసుకుందంటూ సమంతకు సంబంధించిన కొన్ని విషయాలను అభిమానులతో పంచుకుంది.

చిత్రపరిశ్రమలో హీరోలకు, హీరోయిన్లకు రెమ్యునరేషన్ విషయంలో చాలా తేడాలు ఉంటాయి. హీరోలు 100 కోట్లు తీసుకుంటే నటీమణులు 20 కోట్లు కూడా దాటలేదు. దీంతో సామ్ డేరింగ్ స్టెప్ తీసుకుందంట. మార్పు తనతోనే మొదలు అవ్వాలని, తన సినిమాలో అందరికీ సమానంగా జీతం ఇచ్చిందంట. ఎలాంటి తేడాలు లేకుండా అందరినీ సమంత చూస్తుందని, ఇప్పటి వరకు ఇలా ఎవరూ చేయలేదని నందిని రెడ్డి చెప్పుకొచ్చారు.