
నాన్స్టాప్గా సినిమాలు చేసేయడం కాదు, చేసిన సినిమాలు, మనకున్న అన్నీ మార్కెట్లలోనూ పర్ఫెక్ట్ గా పోట్రే అవుతున్నాయా? లేదా? అనేది కూడా చూసుకోవాలి ఈ తరం నాయికలు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టే ఆలియా చాలా అలర్ట్ గా ఉంటున్నారు. అలా లేకుంటే ఎక్కడో ఓ ఏరియాలో ఫేడ్ అవుట్ అయినట్టే ఉంటుంది కెరీర్.

రీసెంట్గా కన్నడలో రఘుతాత రిలీజ్ ఉన్నా.. తెలుగులో పెద్దగా ఈ సినిమాను పబ్లిసిటీ చేసుకోలేకపోయారు కీర్తి సురేష్. కీర్తి సురేష్ చేసిన అదే తప్పు ఇప్పుడు నయనతార చేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.

చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, నయన్ని తెలుగు ఆడియన్స్ బాగా మిస్ అవుతున్నారు. ఆమె చేసిన లేటెస్ట్ సినిమా టెస్ట్ కూడా డైరక్ట్ రిలీజ్ కావడం లేదు. అదీ ఓటీటీలోనే విడుదల చేయాలని అనుకుంటున్నారట. అసలే స్పోర్ట్స్ డ్రామా.. పక్కా ప్రమోషన్లతో రిలీజ్ చేసుకుంటే టాలీవుడ్లోనూ సూపర్ కలెక్షన్లు వచ్చే ఛాన్సుంది మరి..

నార్త్ హీరోయిన్ల మీద కూడా ఈ కంప్లయింట్ బాగానే ఉంది. రీసెంట్గా క్రూ సినిమా చేశారు ముగ్గురు హీరోయిన్లు. కృతిసనన్, టబుకి తెలుగులో మంచి మార్కెట్ ఉన్నా, ఎందుకో దాన్ని క్యాష్ చేసుకోలేకపోయారనే మాటలు బాగా వినిపించాయి. త్వరలో రిలీజ్ అయ్యే దో పత్తీ విషయంలోనూ సేమ్ కంప్లయింట్ కనిపిస్తోంది.

స్త్రీ2 వెయ్యి కోట్లు ఎందుకు టచ్ చేయలేకపోయిందని ఫీల్ అయిన మూవీ లవర్స్ ఎక్కువ. ఆ సినిమాకున్న క్రేజ్కి సౌత్ మార్కెట్ని కూసింత కన్సిడర్ చేసినా థౌజండ్ క్రోర్స్ మార్క్ అనేది ఈజీగా వచ్చేసి ఉంటుందన్నది ట్రేడ్ పండిట్స్ మాట. చూస్తూ చూస్తూ కోట్ల రూపాయలను అలా వదిలేసుకోవడం కన్నా, క్రేజ్ ఉన్న చోట క్యాష్ చేసుకుంటే మంచిదనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి...