
తెలుగులో అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకులకు దగ్గరైన ఆ వయ్యారి.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. ఇద్దరు పిల్లలకు తల్లిగా ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఆమె ఎవరో తెలుసా..

ఆ బ్యూటీ ఎవరో కాదండి.. టాలీవుడ్ బాపుబొమ్మ ప్రణీత సుభాష్. బావ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఈ బ్యూటీకి సరైన బ్రేక్ రాలేదు.

కన్నడకు చెందిన ఈ ముద్దుగుమ్మ.. 2010లో అటు కన్నడ.. ఇటు తెలుగు సినిమాల్లో ఒకేసారి నటించింది. తెలుగు, తమిళం, కన్నడలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంది.

తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన అత్తారింటికి దారేది సినిమాతో భారీగా పాపులారిటీని సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే తన స్నేహితుడు నితిన్ రాజును 2021లో పెళ్లి చేసుకుంది.

పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. ప్రణీత, నితిన్ రాజు దంపతులకు పాప, బాబు ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న ప్రణీత.. గ్లామర్ ఫోజులతో మతిపోగొడుతుంది.