సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది కియారా అద్వానీ. తొలి తెలుగు సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది ఈ భామ.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి దర్శకత్వంలో సినిమా చేసింది. రామ్ చరణ్ హీరోగా నటించిన వినయవిధేయ రామ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమా దారుణంగా బోల్తా కొట్టింది . దాంతో బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సొంతం చేసుకుంది కియారా అద్వానీ.
హీరో సిద్దార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇక ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ చేస్తుంది.
రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్ లో వస్తున్నగేమ్ చెంజర్ సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సోషల్ మీడియాలో ఈ భామ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
కియారాకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నాయి. ఈ ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
కలర్ ఫుల్ డ్రస్ లో రవివర్మ పెయింటింగ్ లా మెరిసింది కియారా. కియారా అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.