
బిగ్బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకుంది. మొత్తం 19 మందితో మొదలైన ఈషోలో ఇప్పుడు కేవలం ఆరుగురు మాత్రమే మిగిలారు. అందులో ఫైనలిస్ట్గా అమ్మాయి ప్రియాంక జైన్.

మౌనరాగం సీరియల్ లో తన నటన.. హవభావాలతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది ప్రియాంక. ఇందులో మాటలు రాని మూగ అమ్మాయిగా ప్రియాంక కనిపించి మంచి ఫేమ్ సంపాదించుకుంది.

ఆ తర్వాత జానకి కలగలేదు సీరియల్ ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఇటు తెలుగులో సీరియల్స్ చేస్తునే.. అటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

ఈ క్రమంలోనే బిగ్బాస్ సీజన్ 7లోకి కంటెస్టెంట్గా అడుగుపెట్టింది. బిగ్బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన అమ్మాయిలు అందరికంటే ప్రియాంక ఎంతో మెచ్యూర్డ్గా గేమ్ ఆడుతూ టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచింది.

ప్రియాంక ముంబైలో జన్మించింది. వ్యాపారంలో తన తండ్రి మోసం చేయడంతో ఆర్థికంగా నష్టపోవడంతో ఇప్పుడు తన ఫ్యామిలీ విషయాలు ప్రియాంక చూసుకుంటుంది. తండ్రి పెళ్లిలో మేకప్ ఆర్టిస్టుగా వర్క్ చేస్తుండగా.. తండ్రి మొబైల్ షాప్ రన్ చేస్తున్నాడు.

బిగ్బాస్ ఫైనలిస్ట్గా నిలిచిన ఒకే అమ్మాయి.. ప్రియాంక జైన్ గురించి ఈ విషయాలు తెలుసా ?..