సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా వరుస సినిమాలు లైన్లో పెట్టేస్తున్నారు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇటీవల బాలీవుడ్ ఎంట్రీ కోసం చేసిన ప్రయత్నం ఫెయిల్ అవ్వటంతో షార్ట్ గ్యాప్ తీసుకున్న సాయి శ్రీనివాస్... ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న ఓ జానర్తో రిస్క్ చేసేందుకు రెడీ అవుతున్నారు సాయి శ్రీనివాస్.
బాలీవుడ్ ఎంట్రీ మీద భారీ ఆశలు పెట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఛత్రపతి రీమేక్తో అనుకున్న టార్గెట్ను రీచ్ అవ్వలేకపోయారు. బిగ్ స్కేల్లో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ కాకపోవటంతో తిరిగి సౌత్ మీద ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం టైసన్ నాయుడు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో తాజాగా మరో మూవీని స్టార్ట్ చేశారు.
చావు కబురు చల్లగా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కౌషిక్. ఈ డైరెక్టర్తో ఓ ఫాంటసీ సినిమా చేస్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సోమవారం ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాతో ఓ రిస్కీ జానర్ను టచ్ చేస్తున్నారు సాయి శ్రీనివాస్.
ప్రస్తుతం సౌత్లో ఫాంటసీ, పీరియాడిక్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. అందుకే బెల్లంకొండ హీరో కూడా ఇదే జానర్లో సినిమాకు రెడీ అవుతున్నారు. అయితే ఈ జానర్లో సినిమా అంటే భారీ బడ్జెట్ తప్పనిసరి, అదే సమయంలో సక్సెస్ రేష్యో చాలా తక్కువ. అందుకే సాయి శ్రీనివాస్ రిస్క్ చేస్తున్నారా? అన్న డిస్కష్ జరుగుతోంది.
గతంలో సాక్ష్యం సినిమా కోసం ఫాంటసీ ఎలిమెంట్ను టచ్ చేశారు సాయి శ్రీనివాస్. ఆ సినిమాకు పాజిటివ్ టాకే వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్తోనే ఇప్పుడు పూర్తి స్థాయి ఫాంటసీ మూవీని టేకప్ చేశారు. ఈ యంగ్ హీరో. మరి ఈ జానర్ బెల్లంకొండ హీరోకు ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.