
ఆషికా రంగనాథ్.. కన్నడలో క్రేజీ బాయ్ అనే సినిమా ద్వారా కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత తన మాతృభాషలోనే ఎన్నో ఆఫర్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగులో కళ్యాణ్ రామ్ సరసన డేవిల్ అనే చిత్రంలో నటించింది. కానీ ఈ మూవీ అంతగా మెప్పించలేదు. దీంతో ఆషికాకు సరైన గుర్తింపు రాలేదు. కానీ ఆ తర్వాత నాగార్జున జోడిగా నా సామిరంగా సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.

దీంతో తెలుగులో ఆషికాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత తమిళంలో యంగ్ హీరో అధర్వకు జంటగా పట్టత్తు అరసన్ చిత్రంలో నటిస్తుంది. అలాగే సిద్ధార్థ్ జోడిగా మిస్ యూ సినిమాలో నటిస్తుంది.

మిస్ యూ సినిమా నవంబర్ 29న విడుదల కావాల్సి ఉంది. కానీ తమిళనాడులో తుఫాన్ అనుకూల పరిస్థితులు కారణంగా చిత్రవిడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమా వాయిదా పై స్పందించిన ఆషికా.. మిస్ యూ చిత్రం వాయిదా పడడం ఎంతో బాధ కలిగించింది. అంతా బాగానే జరుగుతుందని నమ్ముతున్నాను. ఇంతకుముందు నిర్ణయించిన విడుదల తేదీ కంటే ఇంకా మంచి తేదీ వస్తుంది అని అన్నారు.