- Telugu News Photo Gallery Cinema photos Are star heroes distancing themselves from fans with the Pan India trend?
Heroes: పాన్ ఇండియా ట్రెండ్తో హీరోలకు కష్టాలు.. ఫ్యాన్స్కు దూరం..
కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక కూడా ఊడిందంటూ తెలుగులో ఓ అద్భుతమైన సామెత ఉంటుంది. ఇప్పుడు ఇదే మన హీరోల విషయంలోనూ జరుగుతుంది. ప్యాన్ ఇండియా.. ప్యాన్ ఇండియా అంటూ ఫ్యాన్స్కు దూరం అయిపోతున్నారు. అతి జాగ్రత్తకు పోయి ఉన్నది పోగొట్టుకుంటున్నారు. మరి ఎవరా హీరోలు.. వాళ్ల సమస్యేంటి..? ఇదే ఇవాల్టి స్టోరీ..
Updated on: May 05, 2025 | 12:05 PM

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్నే తీసుకోండి.. 2019 నుంచి 2024 మధ్యలో ఈయన చేసింది బ్లాక్ బస్టర్ సినిమా ట్రిపుల్ ఆర్ మాత్రమే. అంటే అరవింత సమేత తర్వాత చేసింది ఒకే సినిమా అన్నమాట. గత ఏడాది దేవర వచ్చి హిట్ అందుకుంది. ఈ ఏడాది వార్ 2 పక్కన పెడితే అయన సింగల్ హీరోగా సినిమా రానట్లే.

రామ్ చరణ్ పరిస్థితి ఇలాగే ఉంది. 2019లో వినయ విధేయ రామలో నటించిన ఈయన.. ఆ తర్వాత నాలుగేళ్లలో ఒకే సినిమా చేసారు.. అదే ట్రిపుల్ ఆర్. మధ్యలో ఆచార్యలో నటించినా.. అది గెస్ట్ అప్పియరెన్స్ మాత్రమే. ఈ ఏడాది గేమ్ చెంజర్ వచ్చిన ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు పెద్ది సినిమా చేస్తున్నారు.

అలాగే అల్లు అర్జున్ 2020లో అల వైకుంఠపురములో చేసారు.. 2021 నుంచి పుష్ప వరల్డ్లోనే ఉన్నారు. దీని తర్వాత పుష్ప 2 సినిమా రావడానికి మూడు ఏళ్లు పట్టింది. ఇప్పుడు అట్లే చేస్తూన్న సైన్స్ ఫిక్షన్ సినిమా కూడా టైం పట్టెలనే ఉంది.

ఇక మహేష్ బాబు విషయానికి వస్తే.. గత ఏడాది గుంటూరు కరంతో వచ్చారు. రాజమౌళితో సినిమా ఒప్పుకున్నా అది సెట్స్పైకి వెళ్ళడానికే ఏడాది పట్టింది. షూటింగ్ పూర్తి కావాలంటే చాల టైం తీసుకుంటారు జక్కన్న. కొన్నేళ్లు సూపర్ స్టార్ ఫ్యాన్స్ వెయిటింగ్ తప్పదు.

మరోవైపు ప్రభాస్ మాత్రం దూకుడు మీదున్నారు. కరోనా తర్వాత రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్ వచ్చాయి.. గత ఏడాది కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ ఏడాది రాజా సాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీంతో స్పిరిట్, కల్కి 2, సలార్ 2, హను రాఘవాపుతో మరో సినెమ, హోంబేలె ఫీల్మ్స్ సంస్థలో 3 సినిమాలు, ప్రశాంత్ వర్మతో ఓ సినిమా, పృథ్విరాజ్ సుకుమార్ దర్శకుడిగా ఓ మూవీ లైన్లో ఉన్నాయి.




