
అమృత ప్రణయ్ అందరికి గుర్తుండే ఉంటుంది.. ప్రేమించి పెళ్లాడిన పాపానికి భర్తను కోల్పోయింది అమృత

ప్రణయ్ హత్య తర్వాత అమృత ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఇప్పుడిప్పుడే ఆమె ఆ బాధనుంచి బయటకు వస్తుంది.

ఈ క్రమంలోనే ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. అడపాదడపా ఇన్ స్టా రీల్స్ చేస్తూ ఉంటుంది.

తాజాగా యాంకర్ లాస్యతో కలిసి అమృత ఓ పాటలో నటించింది.

దీపావళి కానుకగా లాస్య అమృతతో కలిసి ఓ ఓ కవర్ సాంగ్ చేశారు.

అమృత -లాస్య అందంగా ముస్తాబయి దిగిన ఫోటోలను లాస్య షేర్ చేసింది.

ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ ఫోటోలపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.