
బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణితి చోప్రా మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అక్కడ క్రేజీ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. అందం అభినయం ఉన్న ఈ బ్యూటీ సాలిడ్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోతుంది.

పరిణితి చోప్రా నటించిన సినిమాలన్నీ ఈ మధ్యకాలంలో ఫ్లాప్ గా నిలిచాయి. ఏ సినిమా చేసిన అది డిజాస్టర్ గానే మిగిలింది. గత 10 ఏళ్లలో ఆమె నటించిన 9 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

దాంతో పరిణితి చోప్రా పని అయిపొయింది అని అంతా అనుకున్నారు. ఇక ఈ అమ్మడు హీరోయిన్ గా సినిమాలకు గుడ్ బై చెప్పాల్సిందే అని గుసగుసలు కూడా వినిపించాయి. కానీ ఊహించని విధంగా స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చింది.

పరిణీతి 2011లో ‘లేడీస్ vs రిక్కీ బహల్’ రొమాంటిక్ కామెడీ చిత్రంలో వెండితెరపై అడుగు పెట్టింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో రణవీర్ సింగ్ హీరోగా నటించాడు.

2013లో ఆమె నటించిన ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’ సూపర్హిట్ అయింది. 2014లో ‘హసీతో ఫసీ’ సినిమా కూడా కమర్షియల్ సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత పరిణితి నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేక పోయాయి.

తన పెళ్లి గురించి మాట్లాడారు పరిణీతి చోప్రా. రాఘవ్ని తొలిసారి లండన్లో ఓ పార్టీలో చూసినట్టు తెలిపారు. మరుసటి రోజు తనతో ఐదు నిమిషాలు మాట్లాడగానే పెళ్లి చేసుకోవాలనిపించిందని అన్నారు. అప్పటికి అతనికి పెళ్లి అయిందో లేదో కూడా తనకు తెలియదని అన్నారు పరిణీతి చోప్రా.