కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ తారలు కళ్లు చెదిరే డ్రస్సులు ధరించి రెడ్ కార్పెట్ పై మెరిసిపోతుంటారు. ఈ వేడుకలలో ఎప్పటిలాగే హీరోయిన్ ఊర్వశీ రౌతేలా స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.
కేన్స్ వేదికగా ఖరీదైన డ్రస్సులలో మెరిసిపోయింది. అయితే ఇప్పుడు ఊర్వశీ ధరించిన రెండు డ్రస్సుల విలువ తెలిసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఎందుకంటే ఆ రెండు డ్రస్సుల విలువ రూ. 105 ఉంటాయట. రెండు రోజులపాటు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై మొదటి రోజు పింక్ గౌను ధరించింది.
ఈ పింక్ గౌను ధర రూ.47 కోట్లు అని చెబుతున్నారు. పింక్ గౌనులో మరింత అందంగా కనిపించింది. ఖరీదైన డ్రెస్సులో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలలో రెడ్ కార్పెట్ పై కనిపించింది ఊర్వశీ. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఇక నాలుగో రోజు మరింత ఖరీదైన డ్రస్సులో కనిపించింది. ఊర్వశీ ధరించిన బ్లాక్ అండ్ వైట్ కస్టమ్ మేడ్ డ్రెస్ ధర ఏకంగా రూ.58 కోట్లు అని చెబుతున్నారు. ఈ లెక్కన రెండు డ్రెస్సులు కలిపి రూ.105 కోట్లు అని సమాచారం.
ఈసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అందాల ఐశ్వర్యరాయ్ తోపాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కియారా అద్వానీ, అదితి రావ్ హైదరీ, శోభితా ధూళిపాళ్ల, ప్రీతి జింటా తదితరులు కనిపించింది. వీరందరి కంటే ఊర్వశీ మరింత ప్రత్యేకంగా కనిపించింది.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఊర్వశీ రౌతేలా.. రెండు డ్రెస్సుల విలువ రూ.105 కోట్లు..