టాలీవుడ్ ప్రముఖ నటి సురేఖ వాణి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ( జనవరి 09) ఉదయం కూతురు సుప్రియతో కలిసి తిరుమల చేరుకున్న ఆమె శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
దర్శనానంతరం తిరుమల ఆలయం ఎదుట కలిసి ఫొటోలు దిగారు తల్లీ కూతుళ్లు. ఈ సందర్భంగా భక్తులు కూడా వారితో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు.
తమ తిరుమల పర్యటకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకున్నారు సురేఖా వాణి, సుప్రితల దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి
అంతకు ముందు కాలినడక మార్గంలో తిరుమలకు చేరుకున్నారీ తల్లీ కూతుళ్లు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకుంది సుప్రిత.
కాగా సురేఖ వాణి గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆమె కూతురు వెండితెరకు పరిచయం కాబోతుంది.
బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ రన్నరప్ అమర్ దీప్ హీరోగా నటిస్తోన్న ఓ చిత్రంలో సుప్రిత హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.