
దేశంలోనే భారీ రెమ్యునరేష్ టీవీ నటిగా రూపాలీ గంగూలీ రికార్డులకెక్కారు.

రూపాలి నటిస్తున్న ‘అనుపమ’ టీవీ డ్రామా సిరీస్ ప్రస్తుతం ట్రెండింగ్లో దూసుకుపోతుంది. ఇప్పుడు ఈ షో టీఆర్పీ రేటింగ్ ఏకంగా 4 మార్కుకు దగ్గరలో ఉంది

‘అనుపమ’ ఇప్పుడు దేశంలోని పల్లెపల్లెను తాకింది. ఈ షోకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం రూపాలీ గంగూలీ మొదట్లో రోజుకు లక్షన్నర రూపాయలు పారితోషికంగా తీసుకునేవారు.

ప్రస్తుతం ‘అనుపమ’సిరీస్ సూపర్ హిట్ గా దూసుకుపోవడంతో.. ఇప్పుడు రోజుకు 3 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారట.

భారత టెలివిజన్ రంగంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగా ఆమె రికార్డులకెక్కారు.