
ఇంటర్నేషనల్ మదర్స్ డే సందర్భంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ తమ తల్లులుకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు

ఈ సందర్భంగా చాలా మంది సినీ ప్రముఖులు తమ తల్లులతో కలసి వివిధ సందర్భాల్లో దిగిన ఫొటోలు షేర్ చేసుకున్నారు. అలాగే మరికొందరు సెలబ్రిటీలు తమ పిల్లలతో దిగిన ఫొటోస్ ను పంచుకున్నారు.

ఈ క్రమంలో టాలీవుడ్ హీరోయిన్, బాపు గారి బొమ్మ తన ఇద్దరు పిల్లలతో దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే అందరికీ మదర్స్ డే విషెస్ చెప్పింది.

ప్రస్తుతం ప్రణీత షేర్ చేసిన ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు 'సో క్యూట్' అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

కాగా ప్రణీత 2021లో వ్యాపారవేత్త నితిన్ తో కలిసి పెళ్లిపీటలెక్కింది. ఈ జంటకు 2022లో అర్నాఅనే కూతురు పుట్టింది. ఇక సెప్టెంబర్లో ఒక మగబిడ్డకు జన్మినిచ్చింది ప్రణీత.

ఇటీవలే తమ కుమారుడికి ఘనంగా బారసాల నిర్వహించారు ప్రణీత- నితిన్ దంపతులు. అలాగే జై కృష్ణ అని తమ పిల్లాడికి నామకరణం చేశారు.