ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' సినిమా గ్రాండ్గా విడుదలైంది. రామాయణం కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్, జానకిగా ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్ నటించింది.
కాగా గురువారం (జూన్ 15) రాత్రి ఆదిపురుష్ స్పెషల్ షో వేశారు. మూవీ యూనిట్, సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యుల కోసం ఈ స్పెషల్ స్ర్కీనింగ్ ఏర్పాటు చేశారు.
ఈ స్పెషల్ షో కు కృతి సనన్ కూడా హాజరైంది. ఆమెతో పాటు తల్లిదండ్రులు రాహుల్ సనన్, గీతా సనన్ కూడా వచ్చారు.
ఈ సందర్భంగా కృతి సనన్తో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. అయితే ఆమె ఎంతో ఓపికగా వారందరితో ఫొటోలు, సెల్ఫీలు దిగింది.
'అదిపురుష్' కు పాజిటివ్ టాక్ రావడం సంతోషంగా ఉందని, దేశ వ్యాప్తంగా ఇంతమంది సినిమా చూడడం గొప్ప విషయమని కృతి పేర్కొంది.