
అయితే దేవర సెకండ్ పార్టు ఫలానా టైమ్కి స్టార్ట్ కావచ్చని డీటైల్స్ ఏమీ రివీల్ చేయడం లేదు కొరటాల శివ. తారక్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన ఎప్పుడు తీరిక చేసుకుంటే అప్పుడే సెకండ్ పార్టు షూటింగ్ అంటున్నారు.

ఫస్ట్ డే ఎక్కడెక్కడ ఏయే రికార్డులు రిజిస్టర్ అవుతాయోననే టాపిక్ నడుస్తోంది. దేవర ఫస్ట్ పార్ట్ చూడటానికి ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారో, సెకండ్ పార్టు గురించి కూడా అంతే గట్టిగా ఎదురుచూస్తున్నారు జనాలు.

అయితే ఇప్పటికే దేశంలోని పలు నగరాల్లో దేవర మూవీ టీమ్ ప్రమోషన్స్ నిర్వహించింది. నిన్న ( ఆదివారం) హైదరాబాద్ లో దేవర మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు మేకర్స్. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తారక్ అభిమానులు భారీగా తరలి వచ్చారు. భారీగా అభిమానులు రావడంతో అక్కడున్న సెక్యూరిటీ వారిని ఆపే ప్రయత్నం చేశారు. అభిమానులు తిరగబడ్డారు. దాంతో అక్కడ గందరగోళం నెలకొంది. ఫలితంగా దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేశారు.

దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈ వెంత్ క్యాన్సిల్ అవ్వడంతో ఎన్టీఆర్ ఓ ఎమోషనల్ వీడియోను విడుదల చేశారు. మీకంటే నేనే ఎక్కువ బాధపడుతున్నాను. ముమ్మల్ని కలవాలని, సినిమా గురించి మీకు వివరించాలని అనుకున్నా కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈవెంట్ క్యాన్సిల్ అయ్యిందని ఎన్టీఆర్ వీడియోలో తెలిపారు. ఆలాగే జాన్వికపూర్ కూడా ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో జాన్వీ ముద్దుముద్దగా తెలుగులో మాట్లాడి ఆకట్టుకుంది.

అందరికీ నమస్కారం. నన్ను స్వాగతించి ఇంతగా ఆదరిస్తున్నందుకు, నాపై ఇంత ప్రేమను కురిపిస్తున్నాడు తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. నన్ను జానూ పాప అని పిలుస్తున్న ఎన్టీఆర్ అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చింది. అలాగే నేను ఈ మాటలు స్వయంగా మీతో చెబ్ధామనుకున్నాను. కానీ ఈ సారికి అలా కుదరలేదు. మిమ్మల్నందరినీ త్వరలోనే కలుస్తాననుకుంటున్న. ప్రస్తుతానికి ఇది నా నుండి మీకు ఈ చిన్న మెసేజ్ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేసింది జాన్వీ. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.