స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది నటిగా, నిర్మాతగా, అలాగే గాయినిగాను చాలా ఫెమస్ అయ్యింది. ఇక ఈ బ్యూటీ తెలుగు, తమిళ్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
హీరో కార్తీ నటించిన తమిళ చిత్రం విరుమాన్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అలాగే నటన పరంగా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
అలాగే శివకార్తికేయన్ హీరోగా నటించిన మహావీరన్ సినిమాలోనూ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమానే తెలుగులో మహావీరుడుగా రిలీజ్ అయ్యింది. కానీ ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు భైరవం అనే సినిమాతో రాబోతుంది.
టాలీవుడ్ యంగ్ హీరోలు, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది అదితి శంకర్. కాగా సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది.
తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ డ్రస్ లో మైండ్ బ్లాక్ చేసింది ఈ అమ్మడు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. భైరవం బ్యూటీ భలే ఉందే.. అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.