
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దంతో బంగారం ధరలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. ఆదివారం బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. ఖమేనీ మరణించినట్లు వార్తలు వెలువడంతో పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఒక్కరోజే గోల్డ్ రేటు రూ.4 వేలకుపైగా పెరిగి షాకిచ్చింది. నెల ప్రారంభంలోనే మార్చి 1న బంగారం ధరలు పెరగ్గా.. సోమవారం బంగారం ధరలు సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళ్లవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఆదివారం బంగారం ధర రూ.4 వేలకుపైగా పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,73,080 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1,68,710గా ఉండగా.. ఈ రోజు రూ.4,370 పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు ఇప్పుడు రూ.1,58,650గా ఉండగా.. శనివారం రూ.1,54,650 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే రూ.4 వేలు పెరిగింది.

ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా పై ధరలే కొనసాగుతున్నాయి. అటు చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,72,090గా ఉండగా.. శనివారం రూ.1,69,640 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే రూ.2450 పెరిగింది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,57,750గా ఉండగా.. నిన్న రూ.1,55,500 వద్ద స్థిరపడింది.

బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర రూ.1,73,080గా ఉండగా.. నిన్న రూ.1,68,710 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,58,650గా ఉండగా.. నిన్న రూ.1,54,650 వద్ద స్థిరపడింది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్లు రూ.1,73,230గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,58,800గా ఉంది.

ఇక వెండి ధరలు రూ.5 వేలు పెరిగాయి. ప్రస్తుతం ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2.95 లక్షల వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్లో కేజీ వెండిపై ఇవాళ రూ.5 వేలు పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి రూ.3.25 లక్షలు ఉండగా.. నిన్న రూ.3.20 లక్షలుగా ఉంది. ఇక చెన్నై, బెంగళూరులో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.