
బంగారం ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గురువారం పడిపోగా.. శుక్రవారం నాటికి మళ్లీ తగ్గుదలకు బ్రేక్ పడింది. శుక్రవారం సాయంత్రం నాటికి ధరలు ఒక్కసారిగా పెరిగి కొనుగోలుదారులకు షాకిచ్చాయి. ఈ వారంలో పసిడి ధరల్లో భారీగా ఒడిదొడుకులు నమోదయ్యాయి. దీంతో కొనుగోలుదారుల్లో కూడా కన్ప్యూజన్ నెలకొంది.

శుక్రవారం సాయంత్రం నాటికి బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. గంటల వ్యవధిలోనే ధరల్లో పెరుగుదల నమోదైంది. పెరిగిన తర్వాత ప్రస్తుతం హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,61, 570 వద్ద కొనసాగుతోంది. అంటే రూ.550 ధర పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,48,100 వద్ద ట్రేడవుతోంది.

విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,62,550 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,49,000 వద్ద కొనసాగుతోంది. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల ఫ్యూ్ర్ గోల్డ్ రేటు రూ.1,61,570 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,48,100 వద్ద ఉంది.

ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.1,61,720గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,48,250 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2.85 లక్షల వద్ద కొనసాగుతున్నాయి.

ఇక హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.2.95 లక్షల వద్ద కొనసాగుతోంది. నిన్న కూడా ఇదే ధర ఉంది. వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, పలు దేశాలపై ట్రంప్ సుంకాల ప్రభావం బంగారం ధరలపై పడింది.