
.చాలా మంది అధిక శరీర ఉష్ణోగ్రత కారణంగా అనేక సమస్యలు బారిన పడుతుంన్నారు. శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల పాదాల్లో పగుళ్లు, ముక్కులోంచి రక్తం కారడం, పెదాలు పగలడం వంటివి జరుగుతాయి. ఈ వేడిని తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలతో పాటు తెలిసీ తెలియక ఏవి పడితే ఆ మెడిసిన్స్ వాడేస్తుంటారు. ఈ నేపథ్యంలో అధిక శరీర ఉష్ణోగ్రత సమస్య నుంచి ఉపశమనన్ని ఇచ్చే 5 ముఖ్యమైన పండ్ల గురించి నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వలన శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చునని సూచిస్తున్నారు. మరి ఆ 5 ఫ్రూట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పుచ్చకాయ: సాధారణంగా పుచ్చకాయ వేసవి కాలంలో ఎక్కువగా దొరుకుతాయి. ఇందులో ఉండే విటమిన్ సి, ఫైబర్, లైకోపీన్ వంటి మూలకాలు క్యాన్యర్ రాకుండా కాపాడుతాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, సిట్రులిన్, అర్జినైన్ వంటి అమైనో ఆమ్లాలు కూడా ఉన్నాయి. ఇవి నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతాయి. ఇది శరీరంలో రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచుతుంది.

స్ట్రాబెర్రీలు: స్ట్రాబెర్రీలు చాలా ఆరోగ్యకరమైనవి. నారింజలో కంటే ఎక్కువ విటమిన్ సి ఇందులో ఉంది. దాంతోపాటు ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఫ్రీరాడికల్స్ డ్యామేజీ నుంచి రక్షించే యాంటీఆక్సిడెంట్లు ఇందులో ఉన్నాయి. ఇది చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. శరీరంలో వేడిని కంట్రోల్ చేస్తుంది.

నిమ్మకాయ: నిమ్మకాయలు తీసుకోవడం వలన చాల ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణ రోజుల్లో కూడా నిమ్మకాయ జ్యూస్ తీసుకోవచ్చు. గోరువెచ్చని నీరు, తేనె లో నిమ్మరసం కలిపి తీసుకోవాలి. నిమ్మకాయ జలుబు, ఫ్లూ, ఫుడ్ పాయిజనింగ్ వంటి వాటిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

అరటిపండు: అరటిపండులో ఉండే పొటాషియం, విటమిన్ B6 మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడతాయి. మెరుగైన జీర్ణక్రియకు ఉత్తమమైన అరటిపండ్లలో ఉన్న మెగ్నీషియం, రాగి కండరాలను విశ్రాంతి తీసుకోవడానికి, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి కూడా శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.

దోసకాయలు: శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు దోసకాయ తింటే మంచి ఫలితం ఉంటుంది. దీనిలో కేలరీలు అధికంగా ఉంటాయి. అదే సమయంలో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. డీహైడ్రేట్గా ఉన్నప్పుడు దోసకాయ తింటే హైడ్రేట్ చేస్తుంది. దోసకాయతో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.