
అప్పుడే పుట్టిన నవజాత శిశువులు 6 నెలల వరకు తల్లి పాలు తాగుతారు. శిశువు శరీరానికి అవసరమైన పోషకాలు తల్లి పాల నుంచి అందుతాయి. ఆ తర్వాత 6 నెలలకు తేలికపాటి ఆహారం తీసుకోవడం ప్రారంభిస్తారు. ఈ దశ ప్రారంభంలో సెమీ లిక్విడ్ ఫుడ్ ఇచ్చినప్పటికీ వారు వివిధ ఆహారాలు కొరడానికి ఇష్టపడతారు. కానీ ఈ సమయంలో కనీసం 1 నుంచి ఒకటిన్నర సంవత్సరాల వరకు పిల్లలకు ఇచ్చే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కడుపు నొప్పి, జీర్ణక్రియ సమస్యలు సంభవిస్తాయి.

కాబట్టి పిల్లలకు ఏమి తినిపించాలి, ఏది తినిపించకూడదు అనే విషయాలపై అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. కొన్ని ఆహారాలు శరీరానికి మేలు చేస్తాయి. కానీ 1 సంవత్సరంలోపు పిల్లలకు అవి మంచివి కావు. ముఖ్యంగా ఆవు పాలు చాలా ఆరోగ్యకరమైనవి. కానీ 1 సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఆవు పాలు ఇవ్వకూడదు. శరీర పోషణకు అవసరమైన ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఆవు పాలను పిల్లలు జీర్ణించుకోలేరు. ఫలితంగా పిల్లలకు కడుపు ఉబ్బడం, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తేనె ఇవ్వకూడదు. నవజాత శిశువులకు బలహీనమైన ప్రేగులు ఉంటాయి. కాబట్టి తేనె జీర్ణం కాదు. పిల్లలకు తేనె తినిపిస్తే క్లోస్ట్రిడియం బోటులినమ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. ఫలితంగా పిల్లలకు బోటులిజం వస్తుంది. ఫలితంగా కండరాలు బలహీనపడతాయి. మలబద్ధకం సమస్యలు కూడా వస్తాయి.

విటమిన్ సి పుష్కలంగా ఉండే పుల్లని పండ్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. కానీ పుల్లటి పండులో ఉండే విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ వల్ల పిల్లలకు కడుపు సమస్యలు వస్తాయి. ఫలితంగా పిల్లలకు కడుపు నొప్పి, విరేచనాలు అయ్యే అవకాశం ఉంది.

చిన్న పిల్లలకు చాక్లెట్ అస్సలు ఇవ్వకూడదు. ఇది కడుపు నొప్పిని కలిగిస్తుంది. ఇందులోని కెఫిన్, చక్కెర కూడా పిల్లలకు హానికరం.గోధుమలలో గ్లూటెన్ అనే అలెర్జీ కారకం ఉంటుంది. ఇది ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు జీర్ణం చేయడం కష్టం. బదులుగా, ఈ సమయంలో వారికి అన్నం తినిపించవచ్చు.