
సాధారణంగా మీరు తినే కూరలు వంటివి మిగిలిపోతూ ఉంటే వాటిని ఫ్రిజ్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. కొంత మంది అనవసరం అయినవి కూడా ఎప్పుడూ ఫ్రిజ్లో పెడతారు. వాటిల్లో చపాతీ పిండి కూడా ఒకటి. కానీ ఫ్రిజ్లో చపాతీ పిండి పెట్టడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

ఫ్రిజ్లో పెట్టిన చపాతీ పిండితో చపాతీలు చేసుకుని తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఫ్రిజ్లో పెట్టిన చపాతీ పిండిలో ఈజీగా బ్యాక్టీరియా పెరుగుతుంది. వీటిని తినడం వల్ల కడుపులో నొప్పి, ఉబ్బరం, అజీర్తి సమస్యలు తలెత్తవచ్చు.

చపాతీ పిండిలో శరీరానికి మేలు చేసే పోషకాలు ఉంటాయి. చపాతీ పిండిని ఫ్రిజ్లో స్టోర్ చేయడం వల్ల ఆ పోషకాలు అనేవి నశిస్తాయి. మీరు ఆ పిండితో చపాతీలు చేసుకున్నా వ్యర్థమే. పైగా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.

చపాతీ పిండిని కలిపి ఫ్రిజ్లో పెడితే మెత్తగా వస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ ఫ్రిజ్లో ఉంచిన పిండితో చపాతీలు తయారు చేసుంటే అవి చాలా గట్టిగా ఉంటాయి. అంతే కాదు చపాతీల రుచి కూడా మారిపోతుంది.

చపాతీ పిండిని ఓ బాక్స్లో పెట్టి ఫ్రిజ్లో స్టోర్ చేస్తూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల పిండి పాడవ్వడమే కాకుండా.. వాటిని తినడం వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు చపాతీ పిండిని కొద్దిగా కలుపుకుని ఉపయోగించుకోండి.