AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: అబ్బురపరిచే ‘స్టాచ్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌’ విగ్రహావిష్కరణ చిత్రాలు..

విజయవాడలోని బందరు రోడ్డులో ఏర్పాటు చేసిన 205 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. శుక్రవారం సాయంత్రం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టూరిజం శాఖ మంత్రి రోజా, హోంశాఖ మంత్రి తానేటి వనిత, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, మాజీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు.

Srikar T
|

Updated on: Jan 20, 2024 | 12:02 PM

Share
 విజయవాడలోని బందరు రోడ్డులో ఏర్పాటు చేసిన 205 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని  సీఎం జగన్ ఆవిష్కరించారు. శుక్రవారం సాయంత్రం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.

విజయవాడలోని బందరు రోడ్డులో ఏర్పాటు చేసిన 205 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. శుక్రవారం సాయంత్రం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.

1 / 6
మహిళానేతలతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా ప్రాంగణం మొత్తం వెలగిపోయింది. పచ్చని చెట్లు, గార్డెనింగ్ ను ముఖ్యమంత్రి పరిశీలించారు.

మహిళానేతలతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా ప్రాంగణం మొత్తం వెలగిపోయింది. పచ్చని చెట్లు, గార్డెనింగ్ ను ముఖ్యమంత్రి పరిశీలించారు.

2 / 6
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టూరిజం శాఖ మంత్రి రోజా, హోంశాఖ మంత్రి తానేటి వనిత, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, మాజీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టూరిజం శాఖ మంత్రి రోజా, హోంశాఖ మంత్రి తానేటి వనిత, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, మాజీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు.

3 / 6
18.81 ఎకరాల్లో స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు. 9 ఎకరాల్లో పూర్తిగా పచ్చదనాన్ని నింపారు. యాంఫీ థియేటర్‌, మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. లైబ్రరీతో పాటు ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నాలుగు హాళ్లుండగా.. ఒక్కోటి నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి.

18.81 ఎకరాల్లో స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు. 9 ఎకరాల్లో పూర్తిగా పచ్చదనాన్ని నింపారు. యాంఫీ థియేటర్‌, మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. లైబ్రరీతో పాటు ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నాలుగు హాళ్లుండగా.. ఒక్కోటి నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి.

4 / 6
అందులో ఒకటి సినిమా హాలు, మిగిలిన మూడు హాళ్లలో ఆయన చరిత్రను తెలిపే డిజిటల్‌ మ్యూజియం ఉంటుంది. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, మన రాష్ట్రంలోనే ఇంత పెద్ద సమసమాజ స్థాపకుడిని కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు  చేసుకోవడం గర్వంగా ఉందన్నారు.

అందులో ఒకటి సినిమా హాలు, మిగిలిన మూడు హాళ్లలో ఆయన చరిత్రను తెలిపే డిజిటల్‌ మ్యూజియం ఉంటుంది. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, మన రాష్ట్రంలోనే ఇంత పెద్ద సమసమాజ స్థాపకుడిని కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం గర్వంగా ఉందన్నారు.

5 / 6
అంబేద్కర్ విగ్రహం వద్ద నిల్చొని మంత్రులు, ఎమ్మెల్యేలతో ఫోటోలు దిగారు సీఎం జగన్. ఆ తరువాత ఏర్పాటు చేసిన లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో అంబేద్కర్ రూపాన్ని తీసుకొచ్చారు. ఇలా రకరకాల ఆకృతులతో లేజర్ షోను నిర్వహించారు.

అంబేద్కర్ విగ్రహం వద్ద నిల్చొని మంత్రులు, ఎమ్మెల్యేలతో ఫోటోలు దిగారు సీఎం జగన్. ఆ తరువాత ఏర్పాటు చేసిన లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో అంబేద్కర్ రూపాన్ని తీసుకొచ్చారు. ఇలా రకరకాల ఆకృతులతో లేజర్ షోను నిర్వహించారు.

6 / 6