
ఎండలు మండిపోతున్నాయి.. ఫిబ్రవరిలోనే ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో.. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.. ఈ క్రమంలోనే.. భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్లో రాగల మూడు రోజుల వాతావరణ పరిస్థితులను అంచనా వేసింది.. దిగువ ట్రోపో ఆవరణములో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో తూర్పు -ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నట్లు తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయి..? అమరావతి వాతావరణ కేంద్రం ఏం చెప్పింది.. ఈ వివరాలను తెలుసుకోండి..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :- మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్గతలు సాధారణము కంటే 2 నుంచి 4 డిగ్రీలసెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది. గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్గతలు సాధారణము కంటే 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :- మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్గతలు సాధారణము కంటే 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది. గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్గతలు సాధారణము కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

రాయలసీమ :- మంగళవారం, బుధవారం గరిష్ట ఉష్ణోగ్గతలు సాధారణము కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్గతలు సాధారణము కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది. అని.. అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటనలో తెలిపారు.