
కొత్త సంవత్సరంలో విదేశీ పర్యటనకు చాలా ప్లాన్స్ వేస్తుంటారు. పర్యటనకులను దృష్టిలో ఉంచుకుని వివిధ విమానయాన సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. టూర్ ప్లాన్ చేసుకునే వారికి తక్కవ ధరల్లోనే విమాన టికెట్లను దక్కించుకోవచ్చు.

తాజాగా విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. ప్రారంభ విమాన టిక్కెట్టు ధరను రూ.1,497గా నిర్ణయించింది.

ఈ నెల 25 వరకు అమలులో ఉండనున్న ఈ ప్రత్యేక ఆఫర్తో బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఏప్రిల్ 14 లోపు ప్రయాణించాల్సి ఉంటుందని తెలిపింది.

అయితే www.airasia. co.in వెబ్సైట్, కంపెనీ మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చునని సంస్థ సూచించింది. బెంగళూరు-కొచ్చి ఈ టిక్కెట్టు ధర వర్తించనుందని, ఆయా నగరాల మధ్య దూరం ఆధారంగా ధర అధికంగా ఉంటుందని పేర్కొంది. మరోవైపు, ఇండిగో కూడా రూ.2,023కే విమాన టిక్కెట్టును ఆఫర్ చేస్తున్నది. అంతర్జాతీయంగా రూ.4,999గా నిర్ణయించింది.