పవన్ కళ్యాణ్ పర్మిషన్ తోనే ఆ సినిమా చేశా.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన డైరెక్టర్ క్రిష్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత పవన్ దర్శకుడు క్రిష్ తో సినిమా చేయాల్సి ఉంది.

పవన్ కళ్యాణ్ పర్మిషన్ తోనే ఆ సినిమా చేశా.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన డైరెక్టర్ క్రిష్
Follow us

|

Updated on: Dec 25, 2020 | 4:17 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత పవన్ దర్శకుడు క్రిష్ తో సినిమా చేయాల్సి ఉంది. ఆ మధ్యపవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పిరియాడికల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు క్రిష్. ఈ సినిమా కోహినూర్ వజ్రం నేపథ్యంలో సాగుతుందని, ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని మొదటినుంచి ప్రచారం జరుగుతుంది. అయితే ఈ మధ్య క్రిష్-పవన్ సినిమా గురించి ఎక్కడా పెద్దగా వార్తలు రావడంలేదు. సినిమా పైన అటు పవన్, ఇటు క్రిష్ కూడా సైలెంట్ గా ఉండటంతో ఈ సినిమాను పక్కన పెట్టారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక పవన్ వరుసగా వేసే సినిమాలు కమిట్ అవుతున్న నేపథ్యంలో క్రిష్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో ఒక సినిమాను తెరకెక్కించాడు. కేవలం 60 రోజుల సమయంలో ఈ సినిమాను తెరకెక్కించాడు క్రిష్. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. అయితే  పవన్ సినిమాను ఎందుకు పక్కన పెట్టారు అన్నదానిపై క్లారిటీ ఇచ్చాడు క్రిష్. తాజాగా సమంత నిర్వహిస్తున్న టాక్ షోకు హాజరైన క్రిష్ అసలు విషయాన్ని బయట పెట్టారు. పవన్ కళ్యాణ్ పర్మిషన్ తోనే సినిమాను పక్కన పెట్టానని, ఈ  గ్యాప్ లో వైష్ణవ్ తేజ్ తో సినిమా చేసినట్టు తెలిపాడు క్రిష్. పవన్ అటు రాజకీయాలతో ఇటు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అందువల్లే వకీల్ సాబ్ సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. ఈ గ్యాప్ లో క్రిష్ ఆ సినిమాలు కంప్లీట్ చేశారు. ఇక పవన్ సినిమాను కేవలం 45 రోజుల్లోనే పూర్తి చేస్తానని గతంలో చెప్పారు క్రిష్ ఇప్పుడు సమంత షోలోనూ.. అదే విషయాన్ని చెప్పుకొచ్చారు క్రిష్.