సింపుల్ లుక్లో బ్యూటిఫుల్గా రీతూ వర్మ
Phani CH
21 April 2025
Credit: Instagram
రీతు వర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. 2016లో పెళ్లి చూపులు చిత్రం తో హీరోయిన్ గా పరిచయమైంది.
ఈ ముద్దుగుమ్మ 10 మార్చి 1990న తెలంగాణలోని హైదరాబాద్ లో పుట్టింది. మల్లా రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నుంచి బ్యాచిలర్ డిగ్రీ పట్టా తీసుకుంది.
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత మిస్ హైదరాబాద్ బ్యూటీ పోటీలో పాల్గొని ఫస్ట్ రన్నరప్గా నిలిచింది ఈ బ్యూటీ.
2013లో ఎన్టీఆర్ బాద్షా చిత్రంలో కాజల్ చెల్లెలి పాత్రలో తొలిసారిగా వెండితెరపై కనిపించింది ఈ వయ్యారి.
పెళ్లి చూపులు చిత్రం తో ఉత్తమ నటిగా నంది అవార్డును, ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ క్రిటిక్స్ అవార్డును అందుకుంది.
తర్వాత కేశవ, నిన్నిలా నిన్నిలా, టక్ జగదీష్, వరుడు కావలెను, ఓకే ఒక జీవితం వంటి చిత్రాల్లో కథానాయకిగా ఆకట్టుకుంది రీతు వర్మ.
2024లో స్వాగ్ అనే సినిమాలో ఆకట్టుకుంది. తాజాగా మజకాతో మరో హిట్ అందుకుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
కళ్లతోనే కవ్విస్తోన్న అనసూయ.. కుర్రకారు ఈ అందాలు చూస్తే జిల్ జిగా జిగా
అబ్బాయిలు జర భద్రం.. స్టైలిష్ లుక్ లో సెగలు రేపుతున్న మృణాల్
ఇది కదా అందం అంటే.. చిలిపి నవ్వులతో కట్టిపడేస్తున్న అనుపమ