AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు ఆపేస్తుందా? విదేశాంగ శాఖ కీలక వ్యాఖ్యలు

రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకూడదని ప్రధాని మోదీ అంగీకరించారని డోనాల్డ్ ట్రంప్ చెప్పారనే అమెరికా వాదనలను భారత్ తోసిపుచ్చింది. 1.4 బిలియన్ల భారతీయులకు ఇంధన భద్రతను కల్పించడమే అత్యంత ప్రాధాన్యత అని భారత్ పదే పదే బహిరంగంగా ప్రకటించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు ఆపేస్తుందా? విదేశాంగ శాఖ కీలక వ్యాఖ్యలు
Randhir Jaiswal, Mea
Balaraju Goud
|

Updated on: Feb 05, 2026 | 5:35 PM

Share

రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకూడదని ప్రధాని మోదీ అంగీకరించారని డోనాల్డ్ ట్రంప్ చెప్పారనే అమెరికా వాదనలను భారత్ తోసిపుచ్చింది. 1.4 బిలియన్ల భారతీయులకు ఇంధన భద్రతను కల్పించడమే అత్యంత ప్రాధాన్యత అని భారత్ పదే పదే బహిరంగంగా ప్రకటించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. మార్కెట్ పరిస్థితులు, మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల ఆధారంగా భారతదేశం తన ఇంధన కొనుగోళ్లను వైవిధ్యపరుస్తుందని ఆయన అన్నారు.

“మన అవసరాలకు అనుగుణంగా ప్రపంచంలోని ఏ దేశం నుండైనా చమురు కొనుగోలు చేయవచ్చు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం ఉంటుంది. భారత ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలు దేశప్రజలను దృష్టిలో ఉంచుకుని తీసుకోవడం జరుగుతుంది.” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారతదేశంతో ఇంధన సహకారం కొనసాగుతుందని రష్యా కూడా పేర్కొంది. “భారతదేశం వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. మా వాణిజ్యం రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుంది” అని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు.

వెనిజులా నుండి చమురు కొనుగోలుకు సంబంధించి, విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. వెనిజులా ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడి రంగాలలో దీర్ఘకాల భాగస్వామిగా ఉందని పేర్కొంది. “మేము 2019-20 వరకు వెనిజులా నుండి ఇంధనం, ముడి చమురును దిగుమతి చేసుకున్నాము, ఆ తర్వాత ఆపాల్సి వచ్చింది. అనంతరం 2023-24లో వెనిజులా నుండి చమురు కొనుగోలు చేయడం ప్రారంభించాము, కానీ ఆంక్షలు విధించిన తర్వాత ఆపాల్సి వచ్చింది” అని రణధీర్ జైస్వాల్ అన్నారు.

“ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడి, సుంకాల తగ్గింపుకు అమెరికా అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. మేడ్-ఇన్-ఇండియా ఉత్పత్తులు ఇప్పుడు 18% తక్కువ సుంకంతో అమెరికాకు ఎగుమతి చేయబడతాయని ప్రధాని అన్నారు. ఈ వాణిజ్య ఒప్పందం మన ఎగుమతులను పెంచుతుంది. ఇది భారతదేశంలో శ్రమతో కూడిన పరిశ్రమలకు పెద్ద ప్రోత్సాహాన్ని అందిస్తుంది. కొత్త ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. మన ప్రజలకు వృద్ధి, శ్రేయస్సు సాధిస్తారు.” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఇదిలావుంటే, ఇరాన్‌లో బందీలుగా ఉన్న 16 మంది భారతీయుల గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. “ఇరాన్‌లోని 16 మంది నావికులను కలవడానికి మాకు అనుమతి లభించింది. మా అధికారులు బందర్ అబ్బాస్‌లో వారిని కలిశారు. 16 మందిలో ఎనిమిది మంది విడుదలై స్వదేశానికి తిరిగి వస్తున్నారు. మిగిలిన ఎనిమిది మంది గురించి మేము ఇరాన్ అధికారులతో సంప్రదిస్తున్నాము. వారికి ఎలా సహాయం చేయవచ్చో చూస్తున్నాము.” అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..