AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: కశ్మీరీ మంచు అందాలకు ఫిదా.. చిన్నపిల్లల్లా మారిపోయిన రాహుల్, ప్రియాంక

రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ.. మంచులో సరదాగా గడిపారు. చిన్నపిల్లల్లా మారిపోయి.. ఒకరిపై మరొకరు మంచు గడ్డలు విసురుకుంటూ ఎంజాయ్‌ చేశారు. భారత్‌ జోడో యాత్ర ముగింపు సందర్భంగా..

Watch: కశ్మీరీ మంచు అందాలకు ఫిదా.. చిన్నపిల్లల్లా మారిపోయిన రాహుల్, ప్రియాంక
Rahul And Priyanka Snowball Fight
Sanjay Kasula
|

Updated on: Jan 30, 2023 | 1:36 PM

Share

జమ్ముకశ్మీర్‌లో మంచు అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్‌ చేశారు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ.. మంచులో సరదాగా గడిపారు. చిన్నపిల్లల్లా మారిపోయి.. ఒకరిపై మరొకరు మంచు గడ్డలు విసురుకుంటూ ఎంజాయ్‌ చేశారు. భారత్‌ జోడో యాత్ర ముగింపు సందర్భంగా జమ్ముకశ్మీర్‌ పీసీసీ ఆఫీస్‌లో..కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్‌, ప్రియాంక మంచులో ఎంజాయ్‌ చేశారు.

రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోరో యాత్ర ఇవాళ్టితో ముగిసింది. కాశ్మీర్‌లో భారత్ జోరో యాత్రలో రాహుల్‌తో కలిసి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. శ్రీనగర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం రాహుల్ గాంధీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. కాశ్మీర్‌లో రాహుల్, ప్రియాంక చిన్నపిల్లల్లా మారి మంచుతో ఆడుకోంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

శ్రీనగర్ మంచు దుప్పటి పరుచుకుంది. ఈ అద్భుతదృశ్యాన్ని రాహుల్ గాంధీ ప్రియాంక ఆస్వాధించారు. ఈ వీడియోను కాంగ్రెస్, రాహుల్, ప్రియాంక అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.. యాదృచ్ఛికంగా, రాహుల్, ప్రియాంక ఇలా పాల్గొనడం ఇదే మొదటిసారి కాదు. యాదృచ్ఛికంగా, భద్రతా లోపాల కారణంగా కాశ్మీర్ చేరుకున్న భారత్ జోరో యాత్ర నేటితో ముగిసింది.

మంచుతో ఆడుకుంటున్న వీడియోను ఇక్కడ చూడండి..

అయితే, భారత్‌ జోడో యాత్రలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీతో మరో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. అచ్చు రాహుల్‌ గాంధీని పోలిన యువకుడు కనిపించడంతో అతనితో ఫోటో దిగాడు కాంగ్రెస్ ఎంపీ. ఇద్దరు కలిసి చేయి కలిపి చిరునవ్వులు చిందిస్తు ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ  యువకుడి పేరు మహమ్మద్‌ ఫైసల్‌ చౌధరి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ జిల్లా మవానా తహసీల్‌కు చెందిన యువరైతు.

దూరం నుంచి చూస్తే అచ్చు రాహుల్‌ పోలికలతో కనిపించే ఫైసల్‌ను స్థానికులు ‘ఛోటా రాహుల్‌’ అని పిలుస్తారు. కాంగ్రెస్‌ అభిమాని అయిన తండ్రి మరణానంతరం బీఏ చదువును సగంలో ఆపి వ్యవసాయం చేపట్టినట్లుగా ఫైసల్‌ తెలిపాడు.

భారత్‌ జోడో యాత్ర ఢిల్లీలో ఉండగా రాహుల్‌ బృందంతో కలిసి నడకను మొదలు పెట్టాడు.  యాత్రికులతో కలిసి నడుస్తుండగా రాహుల్‌ దృష్టిలో పడటంతో ఫైసల్‌ను దగ్గరకు పిలిచి అయిదు నిమిషాలు మాట్లాడారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం