AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో మళ్ళీ ప్రకృతి విధ్వంసం.. రుద్రప్రయాగ్, చమోలి లో క్లౌడ్ బరస్ట్.. చాలా మంది శిథిలాల కింద సమాధి

ఉత్తరాఖండ్‌లోని రెండు చోట్ల మళ్లీ విధ్వంసం చోటు చేసుకుంది. రుద్రప్రయాగ్, చమోలిలలో మేఘాల విస్పోటనం జరిగింది. చాలా మంది శిథిలాల కింద సమాధి అయ్యారు. చమోలిలోని దేవల్ ప్రాంతంలోని మోపాటాలో అనేక కుటుంబాలు శిథిలాల కింద సమాధి అయ్యాయి. దీనితో పాటు రుద్రప్రయాగ్‌లో కూడా విధ్వంసం జరిగింది.

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో మళ్ళీ ప్రకృతి విధ్వంసం.. రుద్రప్రయాగ్, చమోలి లో క్లౌడ్ బరస్ట్.. చాలా మంది శిథిలాల కింద సమాధి
Cloud Burst In Uttarakhand
Surya Kala
|

Updated on: Aug 29, 2025 | 9:50 AM

Share

ఉత్తరాఖండ్‌లో ప్రకృతి విధ్వంసం సృష్టిస్తోంది. నిరంతర వర్షాల కారణంగా అనేక ప్రాంతాలలో వరస ప్రమాదాలకు జరుగుతూనే ఉన్నట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మరోసారి చమోలి, రుద్రప్రయాగ్ జిల్లాల్లో మేఘాల విస్పోటనం సంఘటనలు నమోదయ్యాయి. చమోలిలోని దేవల్ ప్రాంతంలో అనేక కుటుంబాలు శిథిలాల కింద సమాధి అయినట్లు సమాచారం. అదే సమయంలో రుద్రప్రయాగ్‌లోని సుకేదార్ ప్రాంతంలోని బడేత్ దుంగర్ టోక్‌లో విధ్వంసం జరిగింది. ఇక్కడ కూడా కొంతమంది శిథిలాల కింద సమాధి అయ్యారు. సంఘటన జరిగిన ప్రదేశంలో స్థానిక యంత్రాంగం సహాయ మరియు సహాయక చర్యలను ప్రారంభించింది.

ఈ రెండు సంఘటనల గురించిన సమాచారాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ” రుద్రప్రయాగ్ జిల్లాలోని తహసీల్ బాసుకేదర్ ప్రాంతంలోని బడేత్ దుంగర్ టోక్, చమోలి జిల్లాలోని దేవల్ ప్రాంతంలోని మేఘాల విస్పోటనం కారణంగా శిథిలాల కారణంగా కొన్ని కుటుంబాలు చిక్కుకుపోయాయని సమాచారం అందింది. స్థానిక పరిపాలన అధికారులు బాధితుల సహాయ, రక్షణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. ఈ విషయంలో తాను నిరంతరం అధికారులతో సంప్రదిస్తున్నానని చెప్పారు. ఇప్పటికే ఈ విషయంపై విపత్తు కార్యదర్శి, జిల్లా మేజిస్ట్రేట్‌లతో మాట్లాడి, సహాయక చర్యలను సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన సూచనలు ఇచ్చానని. అందరి భద్రత కోసం బాబా కేదార్‌ను ప్రార్థిస్తున్నాను ” అని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

చమోలిలో జరిగిన విధ్వంసం తర్వాత ..

ఈ సంఘటన తర్వాత ట్రాఫిక్ కూడా దెబ్బతింది. రుద్రప్రయాగ్-రుషికేష్ రహదారిని మూసివేశారు. దీనికి సంబంధించి చమోలి పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్ చేసి.. బ్లాక్ చేయబడిన ప్రదేశాల గురించి తెలియజేశారు. “చమోలిలో నిరంతరం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, అనేక చోట్ల జాతీయ రహదారి మూసుకుపోయింది. వీటిలో నందప్రయాగ్, కామెడ, భనేర్పాని, పాగల్నాల, జిలాసూ సమీపంలోని రోడ్లు ఉన్నాయి” అని పోలీసులు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

మందాకిని నది నీటి మట్టం పెరుగుదల

దీనితో పాటు రుద్రప్రయాగ్‌లోని సిరోబ్‌గఢ్, బన్స్వారా (సియాల్సౌర్) , కుండ్ నుంచి చోప్తా మధ్య 4 వేర్వేరు ప్రదేశాలలో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఈ విషయాన్ని రుద్రప్రయాగ్ పోలీసులు చెప్పారు. దీనితో పాటు, నిరంతర వర్షాల కారణంగా, అలకనంద, మందాకిని నదుల నీటి మట్టం చాలా పెరిగిందని చెప్పారు. రుద్రప్రయాగ్ పోలీసులు , పరిపాలన బృందం సాధారణ ప్రజలను నది ఒడ్డు నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలి వెల్లడంని కోరింది.

రెండు రోజులు భారీ వర్ష సూచన చమోలి, రుద్రప్రయాగ్‌లలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వర్షాలతో పాటు మెరుపులు, బలమైన గాలులు కూడా వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ రెండు జిల్లాలతో పాటు, డెహ్రాడూన్, నైనిటాల్, పిథోరగఢ్, బాగేశ్వర్, ఉత్తరకాశి, తెహ్రీ, చంపావత్‌లలో సెప్టెంబర్ 1 వరకు వర్షం కొనసాగుతుందని హెచ్చరిక జారీ చేసింది ఆ రాష్ట్ర వాతావరణ శాఖ.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us