Uttar Pradesh: ప్రియుడితో రొమాన్స్ చేస్తుండగా చూశారని చెల్లెల్లను చంపేసిన అక్క..

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌ ఇలావా జిల్లాలోని బల్రాయ్ ప్రాంతంలో దారుణం వెలుగు చూసింది. తన ప్రియుడితో శృంగారం చేస్తుండగా.. చూశారనే కారణంగా ఇద్దరు చెల్లెల్లను చంపేసింది అక్కడ. ఆపై ఆధారాలు లేకుండా చేయాలని ప్రయత్నించింది. కానీ చివరకు మ్యాటర్ రివీల్ అవడంతో పోలీసులు ఆ యువతిని అరెస్ట్ జైల్లో వేశారు. ఈ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Uttar Pradesh: ప్రియుడితో రొమాన్స్ చేస్తుండగా చూశారని చెల్లెల్లను చంపేసిన అక్క..
Woman Arrest

Updated on: Oct 11, 2023 | 12:37 AM

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌ ఇలావా జిల్లాలోని బల్రాయ్ ప్రాంతంలో దారుణం వెలుగు చూసింది. తన ప్రియుడితో శృంగారం చేస్తుండగా.. చూశారనే కారణంగా ఇద్దరు చెల్లెల్లను చంపేసింది అక్కడ. ఆపై ఆధారాలు లేకుండా చేయాలని ప్రయత్నించింది. కానీ చివరకు మ్యాటర్ రివీల్ అవడంతో పోలీసులు ఆ యువతిని అరెస్ట్ జైల్లో వేశారు. ఈ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఏడేళ్ల సురభి, ఆమె నాలుగేళ్ల సోదరి రోష్ని మృతదేహాలు ఆదివారం వారి ఇంటి వేర్వేరు గదుల్లో కనిపించాయి. అంజలి ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలడంతో సోమవారం అంజలిని అరెస్టు చేసినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ (రూరల్) సత్యపాల్ సింగ్ తెలిపారు. అంజలి తన సోదరీమణులను చంపడానికి పారను ఉపయోగించింది. హత్యల తర్వాత ఆమె ఆ పారలను కడిగేసి, రక్తం అంటి తన దుస్తులను ఉతికి శుభ్రం చేసింది.

అయితే, ఫోరెన్సిక్ పరీక్షల్లో పారపై రక్తపు మరకలు, యువతి బట్టలపైనా రక్తపు మరకలు ఉన్నట్లు తేలిసింది. అలాగే ఈ కేసులో సదరు కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానించారని, విచారణలో అంజలి తన నేరాన్ని అంగీకరించిందని అధికారి తెలిపారు. హత్య జరిగిన సమయంలో బాలికల తల్లిదండ్రులు ఇంట్లో లేరు. తల్లిదండ్రులు లేని సమయంలో అంజలి తన భాగస్వామితో సన్నిహితంగా ఉండడాన్ని మైనర్ బాలికలు గుర్తించారని, ఆ తర్వాత ఆమె వారిని చంపిందని పోలీసులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us