AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Festival of India 2024: మొదలైన ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఉత్సవాలు.. చివరి రోజు సింధూర్ ఖేలా సహా మరెన్నో వినోద కార్యక్రమాలు

వీ9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఉత్సవాలు చివరి రోజైన ఈరోజు ఆదివారం (అక్టోబర్ 13) ఉదయం 9 గంటలకు సంప్రదాయ పూజలతో ప్రారంభమైంది. ఈ రోజంతా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 5వ రోజు ప్రధాన ఆకర్షణ దుర్గాపూజ ముగింపును సూచించే సంతోషకరమైన సింధూర్ ఖేలా.. ఈ కార్యక్రమంలో మహిళలు ఐక్యత, ఆశీర్వాదం కోసం ఒకరికొకరు కుంకుమ దిద్దుకుంటారు.

Festival of India 2024: మొదలైన ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఉత్సవాలు.. చివరి రోజు సింధూర్ ఖేలా సహా మరెన్నో వినోద కార్యక్రమాలు
Tv9 Festival Of India 2024
Surya Kala
|

Updated on: Oct 13, 2024 | 11:46 AM

Share

నవరాత్రి, దసరా సందర్భంగా ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో నిర్వహిస్తున్న టీవీ9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్నారు. నేడు ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఉత్సవాల ఐదవ రోజు.. చివరి రోజు. ఈ రోజు దుర్గాదేవి పూజ, అర్చనతో జాతర ప్రారంభమైంది. గత 4 రోజులుగా జరుగుతున్న జాతరలో దేశంలోని పలువురు ప్రముఖులతో పాటు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

పండుగ చివరి రోజైన ఈరోజు ఆదివారం (అక్టోబర్ 13) ఉదయం 9 గంటలకు సంప్రదాయ పూజలతో ప్రారంభమైంది. ఈ రోజంతా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 5వ రోజు ప్రధాన ఆకర్షణ దుర్గాపూజ ముగింపును సూచించే సంతోషకరమైన సింధూర్ ఖేలా.. ఈ కార్యక్రమంలో మహిళలు ఐక్యత, ఆశీర్వాదం కోసం ఒకరికొకరు కుంకుమ దిద్దుకుంటారు.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌కు చెందిన భారీ సంఖ్యలో ప్రజలు ఈ జాతరలో భాగమయ్యారు. ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ కూడా జాతరలో పాల్గొని దుర్గాదేవి ఆశీస్సులు తీసుకున్నారు. జాతరలో నాల్గవ శనివారం గర్బా నైట్ జాతరలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గర్బా నైట్‌లో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సాంప్రదాయ జానపద బాణీలతో పాటు, ప్రజలు గర్బాలో అనేక ప్రసిద్ధ బాలీవుడ్ పాటలకు నృత్యం చేశారు.

ఇవి కూడా చదవండి

పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు

కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్‌తో పాటు ఆమె భర్త ఆశిష్ పటేల్ కూడా TV9 రెండవ వార్షిక కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేడా సహా ఈ ఉత్సవానికి అనేక ఇతర ప్రముఖులు హాజరయ్యారు. అతిథులతో పాటు టీవీ9 నెట్‌వర్క్ ఎండీ, సీఈవో బరుణ్ దాస్ కూడా హాజరయ్యారు.

బీజేపీ నేత, ఢిల్లీకి చెందిన లోక్‌సభ ఎంపీ మనోజ్ తివారీ కూడా జాతరలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మనోజ్ దుర్గామాత ఆశీస్సులు తీసుకున్నారు. అద్భుతమైన మరపురాని ఈవెంట్‌ను నిర్వహించినందుకు టీవీ9 నెట్‌వర్క్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఫెస్టివల్‌లో 250కి పైగా స్టాళ్లు

నవరాత్రి, దసరా వేడుకలను పురస్కరించుకుని 250కి పైగా భారతీయ, విదేశీ వంటకాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ నిర్వహించిన జాతరలో ప్రజలు గర్బా డ్యాన్స్‌తో పాటు రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తూ కనిపించారు. బీహార్‌లోని ప్రసిద్ధ లిట్టి-చోఖా, రాజస్థానీ వంటకాల నుండి పంజాబీ వంటకాలు, లక్నోవి కబాబ్, ఢిల్లీకి చెందిన ప్రసిద్ధ చాట్, ఆహార సంబంధిత స్టాల్స్ ఏర్పాటు చేశారు.

ఈ ఉత్సవాల్లో భోజనంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అద్భుతంగా వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వం ఈ జాతరలో కనిపించింది. ఇక్కడ వేదికపై పలువురు జానపద కళాకారులు బెంగాల్‌లోనే కాదు పంజాబ్‌, గుజరాత్‌ల సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. నవరాత్రులను ప్రజలు గర్బా పాటలతో చాలా ఉత్సాహంగా జరుపుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..