బీజేపీ ఎంపీలకు జాతీయ స్థాయిలో శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ప్రారంభమైన శిక్షణా తరగతులు రెండు రోజుల పాటు జరుగుతాయి. ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తదితర సీనియర్ నాయకులు శిక్షణ ఇస్తున్నారు. అభ్యాస వర్గ పేరుతో ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ అంశాలపై నాయకులు మాట్లాడతారు. ముఖ్యంగా చట్టసభల్లో, బయటా ఎంపీలు ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదనే అంశాలపైనే ప్రధానంగా ఫోకస్ పెడుతున్నారు.