AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం.. సెల్ఫీ మోజులో పడి ప్రాణాలు తీసుకున్న యువకులు

ఈ మధ్యకాలంలో స్మార్ట్‌ఫేన్లు వచ్చాక సెల్ఫీలు తీసుకోవడం ఒక ట్రెండ్‌గా మారిపోయింది. సెల్ఫీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ ఫోటోకు వచ్చిన లైకులు చూసుకోని మురిసిపోతున్నారు యవతీ యువకులు. కొంతమందైతే సెల్ఫీ మోజులో పడి ప్రమాదకరమైన స్టంట్లతో సెల్పీలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.

దారుణం..  సెల్ఫీ మోజులో పడి ప్రాణాలు తీసుకున్న యువకులు
Train
Aravind B
|

Updated on: Jun 27, 2023 | 4:24 AM

Share

ఈ మధ్యకాలంలో స్మార్ట్‌ఫేన్లు వచ్చాక సెల్ఫీలు తీసుకోవడం ఒక ట్రెండ్‌గా మారిపోయింది. సెల్ఫీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ ఫోటోకు వచ్చిన లైకులు చూసుకోని మురిసిపోతున్నారు యవతీ యువకులు. కొంతమందైతే సెల్ఫీ మోజులో పడి ప్రమాదకరమైన స్టంట్లతో సెల్పీలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి పరిస్థితిలో ప్రాణాలు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఇప్పుడు అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఉత్తరఖాండ్‌లో హరిద్వార్ జిల్లాలో ఇద్దరు యువకులు రైల్వే వంతెనపై సెల్ఫీలు దిగుతుండగా రైలు ఢీకొనడంతో వారిద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

వివరాల్లోకి వెళ్తే రుర్కీ పట్టణానికి చెందిన సిద్ధార్థ్‌ సైనీ (19), శివం సైనీ (16) అనే యువకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి లక్సర్ ప్రాంతంలో సోలాని నదీ తీరానికి పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు వచ్చారు. దీంతో వాళ్లిద్దరు సమీపంలో ఉన్న దోస్నీ రైల్వే వంతెనపైకి చేరుకున్నారు. అక్కడే సెల్ఫీలు తీసుకుంటుండగా అంతలోనే డెహ్రాడూన్-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ వేగంగా దూసుకొచ్చింది. కానీ ఆ యువకులు రైలు రాకను గుర్తించకపోవడంతో ఆ రైలు వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో వారిద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేస్తున్నాయి. కన్న కొడుకుల మృతితో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us