AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ నెల 9న భారత్‌కు తాలిబన్‌ అగ్రనేత రాక! పాక్‌కు చెక్‌ పెట్టేందుకేనా..?

తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్ పర్యటన ఆఫ్ఘనిస్తాన్-భారత్ సంబంధాల్లో కీలక మలుపు. తాలిబాన్ల పాలన తర్వాత ఇది మొదటి ఉన్నత స్థాయి దౌత్య పర్యటన. UN తాత్కాలిక మినహాయింపుతో జరుగనున్న ఈ పర్యటనకు నెలల తరబడి సన్నాహాలు జరిగాయి.

ఈ నెల 9న భారత్‌కు తాలిబన్‌ అగ్రనేత రాక! పాక్‌కు చెక్‌ పెట్టేందుకేనా..?
Taliban Foreign Minister Am
SN Pasha
|

Updated on: Oct 03, 2025 | 8:09 PM

Share

తాలిబన్ ప్రభుత్వానికి చెందిన ఆఫ్ఘనిస్థాన్‌ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి అక్టోబర్ 9న ఇండియాకు రానున్నారు. ఆగస్టు 2021లో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ఆ దేశం నుంచి ఇండియాకు దౌత్య పరంగా ఇదే మొదటి ఉన్నత స్థాయి పర్యటన. అక్టోబర్ 9, 16 మధ్య ముత్తాకికి భారత్‌లో పర్యటించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అనుమతి ఇచ్చింది.

భారత దౌత్య వర్గాలు ఈ పర్యటన కోసం చాలా నెలలుగా సన్నాహాలు చేస్తున్నాయి. జనవరి నుండి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో సహా భారత అధికారులు దుబాయ్ వంటి తటస్థ ప్రదేశాలలో ముత్తాకి, ఇతర తాలిబాన్ నాయకులతో అనేక రౌండ్ల చర్చలు జరిపారు. మే నెలలో పాకిస్తాన్‌పై భారత్‌ ఆపరేషన్ సిందూర్ తర్వాత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ముత్తాకితో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించినందుకు జైశంకర్ తాలిబాన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

వ్యూహాత్మక పర్యటన..

ముత్తాకి రాబోయే పర్యటన కాబూల్ పై సాంప్రదాయకంగా బలమైన ప్రభావాన్ని కొనసాగిస్తున్న పాకిస్తాన్ కు దౌత్యపరంగా ఎదురుదెబ్బగా పరిగణించాలి. పాకిస్తాన్ 80,000 మందికి పైగా ఆఫ్ఘన్ శరణార్థులను బహిష్కరించిన తర్వాత ఈ సంవత్సరం ప్రారంభంలో పాకిస్థాన్‌, తాలిబన్ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో మధ్యలో భారత్‌ వచ్చేందుకు స్పేస్‌ ఏర్పడింది. ముత్తాకి పర్యటన ఆఫ్ఘాన్‌ భారత్‌తో సంబంధాలను విస్తృతం చేసుకోవాలని, పాకిస్తాన్ పై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశ్యాన్ని సూచిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. తాలిబన్లతో ప్రత్యక్ష సంబంధంతో భారత్‌ తన భద్రతా ప్రయోజనాలను కాపాడుకోవడం, ఉగ్రవాద బెదిరింపులను ఎదుర్కోవడం, ఈ ప్రాంతంలో చైనా, పాకిస్తాన్ ప్రభావాన్ని సమతుల్యం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఉగ్రవాద దాడులను తాలిబన్లు ఖండించారు..

ఏప్రిల్ ప్రారంభంలో కాబూల్‌లో భారత అధికారులతో జరిగిన సమావేశంలో తాలిబన్లు జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్‌, ఆఫ్ఘనిస్తాన్ ఒకటిగా ఉన్నాయని ఆ ఖండన సూచించింది. అప్పటి నుండి ఆహారం, మందులు, మౌలిక సదుపాయాల సహకారంతో సహా ఆఫ్ఘనిస్తాన్‌కు మానవతా సహాయాన్ని భారత్‌ విస్తరించింది.

సెప్టెంబరులో ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన వినాశకరమైన భూకంపం తరువాత భారత్‌ 1,000 గుడారాలు, 15 టన్నుల ఆహార సామాగ్రిని పంపింది. ఆ తర్వాత మందులు, పరిశుభ్రత కిట్లు, దుప్పట్లు, జనరేటర్లతో సహా అదనంగా 21 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. 2021లో తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుండి భారత్‌ నుంచి దాదాపు 50,000 టన్నుల గోధుమలు, 330 టన్నులకు పైగా మందులు, టీకాలు, 40,000 లీటర్ల పురుగుమందులు, ఇతర నిత్యావసరాలను ఆఫ్ఘనిస్తాన్‌కు సరఫరా చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి