సుశాంత్ కేసు, సీబీఐ దర్యాప్తు కోరుతున్న సెలబ్రిటీలు

| Edited By: Pardhasaradhi Peri

Aug 16, 2020 | 11:24 AM

సుశాంత్ సింగ్ కేసులో సీబీఐ దర్యాప్తును కోరుతున్న సెలబ్రిటీల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఊర్వశి రౌతేలా, రష్మీ దేశాయ్ కూడా ఈ కేసులో సీబీఐ ఇన్వెస్టిగేషన్ జరగాలంటూ..

సుశాంత్ కేసు, సీబీఐ దర్యాప్తు కోరుతున్న సెలబ్రిటీలు
Follow us on

సుశాంత్ సింగ్ కేసులో సీబీఐ దర్యాప్తును కోరుతున్న సెలబ్రిటీల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఊర్వశి రౌతేలా, రష్మీ దేశాయ్ కూడా ఈ కేసులో సీబీఐ ఇన్వెస్టిగేషన్ జరగాలంటూ డిమాండ్ చేశారు.  ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న ప్రచారంలో వారు కూడా భాగస్వాములయ్యారు. న్యాయం జరగనిదే శాంతి ఏర్పడదని వారు పేర్కొన్నారు. ఎప్పుడూ సత్యమే జయిస్తుందని ఊర్వశి రౌతేలా ట్వీట్ చేశారు. ఇక సాధ్యమైనంత త్వరగా ఈ కేసు విచారణ జరగాలని, జాప్యం తగదని రష్మీ దేశాయ్ అన్నారు. నటుడు కరణ్ వాహి..తాను లోగడ సుశాంత్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ..నా స్నేహితుడా ! నువ్వు ఎప్పుడూ మా ప్రార్థనల్లో ఉంటావు’ అని వ్యాఖ్యానించాడు.

కంగనా రనౌత్, కృతి సనన్, వరుణ్ ధావన్ వంటి సెలబ్రిటీలు ఇదివరకే ఈ కేసులో సీబీఐ దర్యాప్తును డిమాండ్ చేశారు.