
ఆఫ్ఘనిస్తాన్లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన తర్వాత.. శనివారం సాయంత్రం ఢిల్లీ-ఎన్సిఆర్, జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా మోస్తరు ప్రకంపనలు కలకలం రేపాయి.. శనివారం రాత్రి 7 గంటల తర్వాత.. ఢిల్లీ-ఎన్సీఆర్ లో బలమైన భూకంప ప్రకంపనలు సంభవించాయని ప్రజలు తెలిపారు. జమ్మూ కాశ్మీర్తోపాటు.. ఢిల్లీ-ఎన్సిఆర్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లోనూ ప్రకంపనలు నమోదయ్యాయని.. ఎన్సీఎస్ తెలిపింది. నెటిజన్లు ఈ భూకంపం గురించి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. కాగా.. ఒక్కసారిగా భూప్రకంపనలతో.. అందరూ ఇళ్లల్లోనుంచి, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు.
ప్రాథమిక భూకంప నివేదికల ప్రకారం, శనివారం సాయంత్రం ఆఫ్ఘనిస్తాన్లోని హిందూ కుష్ ప్రాంతంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:04 గంటలకు భూమికి 215 కిలోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపం ప్రకంపనలను పాకిస్తాన్, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు కూడా అనుభవించాయి. ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు ఏవీ లేవు..
ఈ భూకంప కేంద్రం ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్లోని కలాఫ్గాన్కు సుమారు 81 కిలోమీటర్ల దూరంలో ఉండగా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారతదేశం, చైనా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్థాన్ – తుర్క్మెనిస్తాన్లలో ప్రకంపనలు సంభవించాయి.
EQ of M: 6.2, On: 27/06/2026 19:04:51 IST, Lat: 36.442 N, Long: 70.672 E, Depth: 215 Km, Location: Afghanistan.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @DrNKalaiselvi @GSuresh_NCS @ndmaindia pic.twitter.com/lD494VYeiW— National Center for Seismology (@NCS_Earthquake) June 27, 2026
భూకంప శాస్త్రవేత్తలు 6.2 తీవ్రత గల భూకంపాన్ని తీవ్ర నష్టాన్ని కలిగించగల బలమైన సంఘటనగా వర్గీకరిస్తారు, అయితే దాని ప్రభావ తీవ్రత లోతు, ప్రదేశం, స్థానిక మౌలిక సదుపాయాలపై ఆధారపడి ఉంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..