కాల్ చేస్తే కరోనా దగ్గు..తప్పించుకోవాలంటే…ఇదొక్కటే మార్గం…!

| Edited By: Pardhasaradhi Peri

Mar 10, 2020 | 2:45 PM

గతంలో ఎన్నడూ లేని విధంగా అందరికీ ఒకే కాలర్ ట్యూన్ వస్తుంది. అవగాహన పక్కకి ఉంచితే కొందరు మొబైల్ ఫోన్ వినియోగదారులు ఈ కాలర్ ట్యూన్ వల్ల ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఫోన్లు ఎక్కువ చేయాల్సిన పని ఉన్నవారు ఈ కాలర్ ట్యూన్ నుంచి విముక్తి పొందడానికి ఓ టెక్నిక్‌.....

కాల్ చేస్తే కరోనా దగ్గు..తప్పించుకోవాలంటే...ఇదొక్కటే మార్గం...!
Follow us on

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 4 వేల 9కి చేరింది. లక్షా 14 వేల 285 మంది కరోనా బాధితులు ఉన్నారు. 6 వేల 88 మందికి సీరియస్ గా ఉంది. 113 దేశాలకు వైరస్ పాకింది. కరోనా వైరస్ చైనాలో తగ్గి ఇతర దేశాల్లో పెరుగుతోంది. మందులేని మహమ్మారి కరోనా వైరస్‌కు ‘చికిత్స కన్నా నివారణ మేలు’ అనే దిశలో ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి ఫోన్‌ చేసిననపుడు కరోనా అవగాహన సందేశాన్ని వినిపిస్తున్నాయి.

కరోనాపై అవగాహన కల్పిస్తూ…ఫోన్‌లో ఆ ఆడియో దాదాపు 30 సెకన్ల పాటు వస్తుంది. ఏ నెట్‌వర్క్‌ను మినహాయించకుండా అందరూ ఈ ఆదేశాలను పాటించాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీచేసింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా అందరికీ ఒకే కాలర్ ట్యూన్ వస్తుంది. అవగాహన పక్కకి ఉంచితే కొందరు మొబైల్ ఫోన్ వినియోగదారులు ఈ కాలర్ ట్యూన్ వల్ల ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఫోన్లు ఎక్కువ చేయాల్సిన పని ఉన్నవారు ఈ కాలర్ ట్యూన్ నుంచి విముక్తి పొందడానికి ఓ టెక్నిక్‌ ఉపయోగించవచ్చు అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. నెంబర్ డయల్ చేసి కరోనా మెసేజ్ వస్తున్నప్పుడు 1నెంబర్ నొక్కితే కరోనా కాలర్ ట్యూన్ ఆగిపోతుందట. మరెందుకు ఆలస్యం ఈ సారి మీరు ట్రై చేయండి.