జమ్మూ కాశ్మీర్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన హిజ్ బుల్ ఉగ్రవాది తండ్రి..ఎవరంటే ..?

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో మరణించిన ఉగ్రవాది బుర్హన్ వని తండ్రి ముజఫర్ వని ఆదివారం జాతీయ జెండాను ఎగురవేశారు.వృత్తి రీత్యా టీచర్ అయిన ఈయన.. ఈ జిల్లాలోని ట్రాల్ లో గల ఓ స్కూల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాడు.

జమ్మూ కాశ్మీర్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన హిజ్ బుల్ ఉగ్రవాది తండ్రి..ఎవరంటే ..?
Hoist National Flag
Follow us

| Edited By: Phani CH

Updated on: Aug 15, 2021 | 3:01 PM

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో మరణించిన ఉగ్రవాది బుర్హన్ వని తండ్రి ముజఫర్ వని ఆదివారం జాతీయ జెండాను ఎగురవేశారు.వృత్తి రీత్యా టీచర్ అయిన ఈయన.. ఈ జిల్లాలోని ట్రాల్ లో గల ఓ స్కూల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాడు. 2018 జులైలో దక్షిణ కాశ్మీర్ లో భద్రతా దళాలతో జరిగిన ఎన్ కౌంటర్ లో బుర్హన్ వని చనిపోయాడు. ఈ ఎదురుకాల్పుల ఘటన కాశ్మీర్ లో 5 నెలల పాటు ఆందోళనకు దారి తీసింది. పోలీసు కాల్పులు, ఘర్షణల్లో సుమారు 100 మంది మరణించగా వందలమంది గాయపడ్డారు. 2018 జులై 12 న శ్రీనగర్ కి 83 కి.మీ. దూరంలోని కొకెర్ నాగ్ ప్రాంతంలో బుర్హన్ వని, అతని ఇద్దరు సహచరులు పోలీసు కాల్పుల్లో మరణించారు., పలువురు స్థానిక యువకులను ఉగ్రవాదం వైపు మరలేలా బుర్హన్ ప్రోత్సహిస్తూ వచ్చేవాడని పోలీసులు అప్పట్లోనే తెలిపారు. ఉగ్రవాదులుగా మారాలంటూ వీడియోలు, ఫోటోల ద్వారా సోషల్ మీడియాలో వారిని రెచ్చగొట్టేవాడని ఖాకీలు గుర్తు చేశారు. అతనిపై 10 లక్షల రివార్డును కూడా ప్రకటించారు. తన అన్నను పోలీసులు వేధించినందుకు ప్రతీకారంగా అతగాడు చేత తుపాకీ పట్టాడు. అయితే సుమారు 20 ఏళ్ళ ప్రాయంలోనే ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు. తన 15 ఏళ్ళ వయస్సులోనే 2010 లో వని ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడు.

అలాంటి టెర్రరిస్టు తండ్రి ఇప్పుడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ స్కూల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేయడం విశేషం. కొడుకు టెర్రరిస్టు కార్యకలాపాల వైపు మళ్లినప్పటికీ ఈ తండ్రి తన పవిత్ర ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగుతూ వచ్చాడు. జిల్లా అధికారులు ప్రత్యేకంగా ఆయన చేత ఈ కార్యక్రమం నిర్వహింపజేశారు.

మరిన్ని ఇక్కడ చూడండి: ఆఫ్గనిస్తాన్ లో అమెరికన్ ఎంబసీ అధికారులు ఏం చేస్తున్నారో తెలుసా ..?

Car Hit: తనిఖీ చేస్తుండగా దూసుకొచ్చిన కారు.. మద్యం మత్తులో పోలీసులను ఢీ కొట్టాడు.. కట్ చేస్తే..

కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం