
భారత్లోని పరిశోధనాభివృద్ధి మీద దృష్టి పెట్టాలని, నూతన ఉత్పత్తులను చేపట్టాలని ప్రముఖ మొబైల్ టెక్ దిగ్గజం దక్షిణ కొరియా కంపెనీ శాంసంగ్ నిర్ణయించింది. ఇండియా నుంచి ఎగుమతుల కేంద్రంగా అభివృద్ది చేయాలని.. ఇందులో భాగంగా మేకిన్ ఇండియా ఉత్పత్తులనే అభివృద్ది చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని శాంసంగ్ ప్రకటించింది.
శాంసంగ్ ఇండియాలో 25 సంవత్సరాలు పూర్తవుతున్నందున కొత్తగా తీసుకువచ్చిన పవరింగ్ డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆర్అండ్డీ స్థానిక టెక్ టాలెంట్ పీపుల్, స్టార్టప్స్లను సెలక్ట్ చేసుకుంటుంది. 5జీ, ఏఐ, ఐఓటీ, క్లౌడ్ టెక్నాలజీ మీద ప్రత్యక దృష్టి పెడతామని శాంసంగ్ సౌత్వెస్ట్ ఏషియా ప్రెసిడెంట్ అండ్ సీఈఓ కెన్ కాంగ్ తెలిపారు. కాగా కొత్తగా వస్తున్న పారిశ్రామికవేత్తలు, విద్యార్థులతో టెక్ ఇన్నోవేషన్ను మరింత సమృద్ధి చేసేందుకు ఓపెన్ ఇన్నోవేషన్ను విసృతం చేస్తామన్నారు. డిసెంబర్ చివరిలో శాంసంగ్ ఇండియాలో 25 సంవత్సరాలు పూర్తవుతాయన్నారు. ప్రస్తుతం ఇండియాలో శాంసంగ్ కంపెనీకి సంబంధించిన మొబైల్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాలు 2, అర్అండ్డీ సెంటర్లు 5, డిజైన్ సెంటర్ ఒకటి ఉంది. సుమారు 2 లక్షల ఔట్లెట్లు, 70 వేల మంది ఉద్యోగులున్నారు.