హనీమూన్ హత్య కేసులో రోజుకో ట్విస్ట్‌.. తాజాగా రెస్టారెంట్‌ యజమాని చెప్పిన షాకింగ్ నిజాలు…?

సోనమ్, రాజ్, మరో ముగ్గురు నిందితులు మేఘాలయ పోలీసుల అదుపులో ఉన్నారు. మరోవైపు దర్యాప్తులో భాగంగా మేఘాలయ పోలీసుల బృందం ఇండోర్‌ చేరుకుంది. వారు సోనమ్ కుటుంబం, రాజ్ కుటుంబంతో పాటుగా అనేక మందిని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక రెస్టారెంట్ యజమాని కొత్త విషయాన్ని వెల్లడించాడు. నిందితులందరూ ఇండోర్‌లోని ఒక రెస్టారెంట్‌లో కలుసుకున్నారని,

హనీమూన్ హత్య కేసులో రోజుకో ట్విస్ట్‌.. తాజాగా రెస్టారెంట్‌ యజమాని చెప్పిన షాకింగ్ నిజాలు...?
Raja Raghuvanshi Murder

Updated on: Jun 19, 2025 | 9:56 PM

హనీమూన్ టూర్లోనే హత్యకు గురైన రాజా రఘువంశీ హత్య కేసులో మేఘాలయ పోలీసుల దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా మరో షాకింగ్‌ నిజం బయటపడింది. సోనమ్, రాజ్, మరో ముగ్గురు నిందితులు మేఘాలయ పోలీసుల అదుపులో ఉన్నారు. మరోవైపు దర్యాప్తులో భాగంగా మేఘాలయ పోలీసుల బృందం ఇండోర్‌ చేరుకుంది. వారు సోనమ్ కుటుంబం, రాజ్ కుటుంబంతో పాటుగా అనేక మందిని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక రెస్టారెంట్ యజమాని కొత్త విషయాన్ని వెల్లడించాడు. నిందితులందరూ ఇండోర్‌లోని ఒక రెస్టారెంట్‌లో కలుసుకున్నారని, అక్కడే వారు రాజాను హత్య చేయాలని ప్లాన్ చేశారని పోలీసులకు చెప్పినట్టుగా తెలిసింది.

నిందితులు రాజ్ కుష్వాహా, విశాల్ చౌహాన్ తమ స్నేహితులతో కలిసి ఇక్కడికి వచ్చారని రెస్టారెంట్ యజమాని పోలీసులకు చెప్పాడు. హత్య కేసులో నిందితుల ఫోటోలను చూసి వారంతా ఇక్కడికి వచ్చినట్టుగా గుర్తించాడట. రెస్టారెంట్‌లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని, కానీ అవి 10 రోజులు మాత్రమే రికార్డ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని చెప్పారు.

అయితే, రాజా రఘువంశీ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీస్‌ బృందం నిందితులందరినీ ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్‌ రీక్రియేషన్​చేశారు. హనీమూన్‌కు వెళ్లిన భర్తను భార్యే హత్య చేయించడం, ఆపై ఒక కొత్త వ్యక్తి పేరు తెరపైకి రావడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..