ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ దేశం బొమ్మల (టాయ్స్) హబ్ గా మారాలంటూ చేసిన వ్యాఖ్యను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..తన ట్వీట్ లో సెటైర్ వేశారు. ఇప్పుడు టాయ్స్ కన్నా నీట్, జేఈఈ పరీక్షలపై చర్చ ముఖ్యమని ఆయన అన్నారు. ఈ కోవిడ్ తరుణంలో ఈ పరీక్షలను నిర్వహించాలన్న కేంద్రం నిర్ణయానికి నిరసన తెలపాలని లక్షలాది విద్యార్థులు యోచిస్తుంటే ఈ పరీక్షలపై చర్చ జరపకుండా ‘ఖిలోనా (ఆటబొమ్మలపై) పే చర్చా’ ఏమిటని ఆయన ట్వీటించారు. అంతే కాదు, ‘మన్ కీ నహీ.. స్టూడెంట్స్ కీ బాత్’ అని హ్యాష్ ట్యాగ్ కూడా రాహుల్ జత చేశారు.’పరీక్షా పే చర్చా’ అన్నది ముఖ్యం అన్నారు.
ఈ దేశంలో పిల్లల అభివృధ్దికి టాయ్స్ చాలా అవసరమని, వాటి ఉత్పత్తిలో ఇండియా గ్లోబల్ లీడర్ కావాలని మోదీ వ్యాఖ్యానించారు. ఇండియా టాయ్స్ హబ్ గా మారాలి.. గ్లోబల్ టాయ్ మార్కెట్ 7 లక్షల కోట్ల విలువైనదని, ఈ మార్కెట్లో ఇండియాకు తక్కువ వాటా ఉందని, ఇది సరికాదని ఆయన పేర్కొన్నారు. అయితే విద్యార్థులే ఈ దేశ భవిష్యత్తుకు మూల స్తంభాలని రాహుల్ అన్నారు.
JEE-NEET aspirants wanted the PM do ‘Pariksha Pe Charcha’ but the PM did ‘Khilone Pe Charcha’.#Mann_Ki_Nahi_Students_Ki_Baat
— Rahul Gandhi (@RahulGandhi) August 30, 2020
NEET-JEE aspirants’ safety should not compromised due to the failures of the Govt.
Govt must listen to all stakeholders and arrive at a consensus.#SpeakUpForStudentSafety pic.twitter.com/Y1CwfMhtHf
— Rahul Gandhi (@RahulGandhi) August 28, 2020