Mobile Phone: జైల్లో ఆకస్మిక తనిఖీలు.. భయంతో మొబైల్‌ ఫోన్‌ మింగేసిన ఖైదీ..

|

Feb 19, 2023 | 3:27 PM

జైల్లో కొందరు ఖైదీలకు వీఐపీ మర్యాదలు జరుగడం షరా మామూలైపోయింది. అంటే స్పెషల్ బెడ్‌, సెల్‌ ఫోన్‌, టీవీ, డ్రగ్స్, ఆహారం.. ఇలా అన్ని ఇతర ఖైదీల మాదిరికాకుండా ప్రత్యేక సదుపాయాలు కొందరికి అందుతుంటాయి. ఐతే..

Mobile Phone: జైల్లో ఆకస్మిక తనిఖీలు.. భయంతో మొబైల్‌ ఫోన్‌ మింగేసిన ఖైదీ..
Prisoner Swallows Mobile Phone
Follow us on

జైల్లో కొందరు ఖైదీలకు వీఐపీ మర్యాదలు జరుగడం షరా మామూలైపోయింది. అంటే స్పెషల్ బెడ్‌, సెల్‌ ఫోన్‌, టీవీ, డ్రగ్స్, ఆహారం.. ఇలా అన్ని ఇతర ఖైదీల మాదిరికాకుండా ప్రత్యేక సదుపాయాలు కొందరికి అందుతుంటాయి. ఐతే బీహార్‌లోని గోపాల్‌గంజ్‌ డివిజన్‌ జైల్‌లో అధికారులు శనివారం రాత్రి (ఫిబ్రవరి 18) ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైసర్ అలీ అనే ఖైదీ వద్ద ఉన్న మొబైల్‌ ఫోన్‌ పోలీసుల కంటపడకుండా ఉండేందుకు మింగేశాడు. కొద్దిసేపటికే తీవ్రకడుపు నొప్పివచ్చి, క్షణాల్లో అతని ఆరోగ్యం క్షీణించింది. హుటాహుటీన ఆసుపత్రికి తరలించడంతో ఎక్స్‌రే తీసిన డాక్టర్లు అతని కడుపులో మొబైల్ ఫోన్ ఉండటాన్ని గమనించి ఖంగుతిన్నారు.

వెంటనే కైసర్ అలీకి శస్త్ర చికిత్స చేసి ఫోన్‌ బయటికి తీశారు. తర్వాత పోలీసులు సదరు ఖైదీని విచారించగా పట్టుబడతామనే భయంతో ఖైదీ మొబైల్ ఫోన్ మింగేసినట్లు చెప్పుకొచ్చాడు. కాగా ఇంరద్వా రఫీ గ్రామనికి చెందిన కైసర్ అలీ జనవరి 17, 2020న హాజియాపూర్ గ్రామ సమీపంలో డ్రగ్స్‌ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. నేరం రుజువు కావడంతో కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది. అప్పటి నుంచి గోపాల్‌గంజ్‌ డివిజన్‌ జైల్‌లో శిక్ష అనుభవిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.