LK Advani Birthday: లాల్ కృష్ణ అద్వానీ పుట్టినరోజు.. ఇంటికెళ్లి శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు తీసుకున్న ప్రధాని మోదీ, రాజ్‌నాథ్ సింగ్..

ఎల్‌కే అద్వానీ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆయన ఇంటికి చేరుకున్నారు. అంతకుముందు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా అద్వానీ ఇంటికి చేరుకుని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

LK Advani Birthday: లాల్ కృష్ణ అద్వానీ పుట్టినరోజు.. ఇంటికెళ్లి శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు తీసుకున్న ప్రధాని మోదీ, రాజ్‌నాథ్ సింగ్..
PM Modi Meet BJP leader LK Advani

Updated on: Nov 08, 2022 | 12:42 PM

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీకి ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అద్వానీ ఇవాళ 96వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో పాటు దేశ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోమవారం ఉదయం ఢిల్లీలోకి ఎల్‌కు అద్వానీ నివాసానికి  ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ వెళ్లారు. ప్రధాని మోదీ దాదాపు 30 నిమిషాల పాటు అద్వానీ నివాసంలోనే ఉన్నారు. ఈ సందర్భంగా లాల్ కృష్ణ అద్వానీ నుంచి ప్రధాని మోదీ ఆశీస్సులు తీసుకున్నారు. అద్వానీకి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అనంతరం నవ్వుతూ కాసేపు ముచ్చటించారు. అద్వానీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రధాని మోదీ ప్రతి సంవత్సరం ఆయన ఇంటికి వస్తుంటారు.

రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్..

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ట్వీట్ చేయడం ద్వారా అభినందనలు తెలిపారు, “పూజించే లాల్ కృష్ణ అద్వానీ జీకి పుట్టినరోజు సందర్భంగా చాలా మంది శుభాకాంక్షలు. అతను భారత రాజకీయాలలో అత్యున్నత వ్యక్తులలో ఒకటిగా పరిగణించబడ్డాడు. దేశం, సమాజం మరియు పార్టీ అభివృద్ధి ప్రయాణంలో ఆయన చాలా ముఖ్యమైన కృషి చేశారు. ఆయనకు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్షుని కోరుకుంటున్నాను.

సింధ్ ప్రావిన్స్‌లో జన్మించారు..

లాల్ కృష్ణ అద్వానీ అవిభక్త భారతదేశంలోని సింధ్ ప్రావిన్స్‌లో 1927 నవంబర్ 8న జన్మించారు. అద్వానీ తండ్రి పేరు కృష్ణచంద్ డి అద్వానీ, తల్లి పేరు జియాని దేవి. పాకిస్తాన్‌లోని కరాచీలో పాఠశాల విద్యను అభ్యసించారు. తర్వాత సింధ్‌లోని కాలేజీలో చేరారు. దేశం విడిపోయినప్పుడు కుటుంబం ముంబైకి మారింది. ఇక్కడ ఆయన న్యాయశాస్త్రం అభ్యసించారు. అద్వానీ తన 14వ ఏట రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో చేరారు. 1951లో శ్యామ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన జనసంఘ్‌లో చేరారు. 1977లో జనతా పార్టీలో చేరారు. అద్వానీ బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు.. బీజేపీతో అద్వానీ భారత రాజకీయాల గమనాన్నే మార్చేశారు. ఆధునిక భారతదేశంలో హిందుత్వ రాజకీయాలతో అద్వానీ ప్రయోగాలు చేశారు. అతని ప్రయోగం చాలా విజయవంతమైంది. భారతీయ జనతా పార్టీ 1984లో 2 సీట్లతో ప్రయాణం ప్రారంభించి 2014లో సంపూర్ణ మెజారిటీని సాధించింది.

ఆయన 1998 నుంచి 2004 వరకు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వంలో హోం వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేశారు. 2022 జూన్ నుంచి 2004 మేరకు భారత ఉప ప్రధానిగా సేవలు అందించారు. ఆయన 10వ లోక్‌సభ, 14వ లోక్‌సభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. 1990లలో బీజేపీకి శక్తి కేంద్రంగా ఉన్నారు. 2009లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా అద్వానీ ఉన్నారు.. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ అధికారం దక్కించుకోలేకపోయింది.

1990లో అద్వానీ రథయాత్ర

1990లో అద్వానీ రథయాత్రను ప్రారంభించారు. రామ మందిర నిర్మాణానికి మద్దతునిచ్చేందుకు అద్వానీ 25 సెప్టెంబర్ 1990న సోమనాథ్ నుండి రథయాత్ర ప్రారంభించారు. ఈ రథయాత్ర దేశ చరిత్రను మలుపుతిప్పింది. అద్వానీ తన ఉద్వేగభరితమైన, అద్భుతమైన ప్రసంగాల వల్ల హిందుత్వానికి హీరోగా మారారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం