Ramnath Kovind: నా జీవితంలో ఆ క్షణాలను ఎప్పటికీ మర్చపోలేను.. భావోద్వేగంతో రాష్ట్రపతిగా చివరి ప్రసంగం

Ramnath Kovind: రాష్ట్రపతి వీడ్కోలు ప్రసంగం: దేశ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనున్న సందర్భంగా ఆదివారం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశానికి..

Ramnath Kovind: నా జీవితంలో ఆ క్షణాలను ఎప్పటికీ మర్చపోలేను.. భావోద్వేగంతో రాష్ట్రపతిగా చివరి ప్రసంగం
Ramnath Kovind

Updated on: Jul 24, 2022 | 9:09 PM

Ramnath Kovind: రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ నేటితో పదవీ కాలం ముగియనుంది. జూలై 25న కొత్త రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈరోజు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ఆదివారం ఢిల్లీలో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తన జీవితంలో మర్చిపోలేని క్షణాలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. భారతదేశానికి తాను నాయకత్వం వహించడం ఎంతో విశేషమని అన్నారు. ఈ దేశంలో తిలక్, గోఖలే, భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, శ్యామా ప్రసాద్ ముఖర్జీ, సరోజినీ నాయుడు, కమలాదేవి ఛటోపాధ్యాయ వరకు గొప్ప వ్యక్తులు ఉన్నారని, అటువంటి వ్యక్తులందరి ఏకైక లక్ష్యం మానవత్వం ఒకే లక్ష్యం కోసం సిద్ధంగా ఉండటమేనని అన్నారు.

19వ శతాబ్దంలో దేశమంతటా బానిసత్వానికి వ్యతిరేకంగా ఎన్నో తిరుగుబాట్లు జరిగాయన్నారు. దేశప్రజల్లో కొత్త ఆశలు రేకెత్తించిన చాలా మంది తిరుగుబాటు వీరుల ఉన్నారని, ఇప్పుడు అతని వీరోచిత కథలను చాలా గౌరవంగా స్మరించుకుంటున్నారన్నారు. ఐదేళ్ల క్రితం మీరంతా నాపై నమ్మకం ఉంచి, మీరు ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారానే నన్ను భారత రాష్ట్రపతిగా ఎన్నుకున్నారని కోవింద్ అన్నారు. మీ దేశప్రజలందరికీ, మీ ప్రజాప్రతినిధులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.

దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహించిన పలువురు ప్రముఖుల్లో హంసబెన్ మెహతా, దుర్గాబాయి దేశ్‌ముఖ్, రాజకుమారి అమృత్ కౌర్, సుచేతా కృప్లానీ సహా 15 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. రాజ్యాంగ పరిషత్ సభ్యుల అమూల్యమైన సహకారంతో రూపొందించబడిన భారత రాజ్యాంగం ఎల్లప్పుడూ మనకు వెలుతురునిస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి

మన పూర్వీకులు, మన ఆధునిక జాతి నిర్మాతలు తమ కృషి, సేవాతత్పరతతో న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ఆదర్శాలను సాకారం చేశారని అన్నారు. మనం వారి అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు సాగాలన్నారు. ప్రతి ఒక్కరు వారివారి జీవితంలో ప్రకృతిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

కాన్పూర్‌లోని తన ఉపాధ్యాయులను ప్రస్తావిస్తూ..

తన సొంత జిల్లా కాన్పూర్ దేహత్ గురించి ప్రస్తావిస్తూ, గ్రామంలోని అతి సామాన్య కుటుంబంలో పెరిగిన నేను ఈ రోజు దేశప్రజలందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తున్నానని, దీని కోసం నేను ప్రజాస్వామ్యబద్ధంగా జీవించాలనుకుంటున్నాను. దేశం, వ్యవస్థ శక్తికి నేను వందనం చేస్తున్నాను. రాష్ట్రపతి హయాంలో తన స్వగ్రామాన్ని సందర్శించడం, కాన్పూర్ పాఠశాలలోని వృద్ధ ఉపాధ్యాయుల పాదాలను తాకడం, వారి ఆశీస్సులు కోరడం తన జీవితంలో ఎప్పటికీ మరపురాని క్షణాలలో నిలిచిపోతాయని రామ్ నాథ్ కోవింద్ అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us