Indian Naval Fleet: విశాఖలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ.. రాష్ట్రపతి కోవింద్‌కు నౌకాదళం గౌరవ వందనం..

Indian Naval Fleet 2022: విశాఖ సాగర తీరంలో ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ ప్రారంభమైంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఐఎన్ఎస్ (INS) సుమిత్రను అధిరోహించి.. నౌకాదళ శక్తి సామర్థ్యాల్ని సమీక్షిస్తున్నారు.

Indian Naval Fleet: విశాఖలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ.. రాష్ట్రపతి కోవింద్‌కు నౌకాదళం గౌరవ వందనం..
Indian Naval Fleet

Updated on: Feb 21, 2022 | 11:42 AM

Indian Naval Fleet 2022: విశాఖ సాగర తీరంలో ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ ప్రారంభమైంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఐఎన్ఎస్ (INS) సుమిత్రను అధిరోహించి.. నౌకాదళ శక్తి సామర్థ్యాల్ని సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా భారత నౌకాదళాలకు చెందిన యుద్ధ విమానాలన్నీ పైకి ఎగురుతూ రాష్ట్రపతి కోవింద్ (Ram Nath Kovind) కుగౌరవ వందనం సమర్పించాయి. ఈ సందర్భంగా నేవీ చేసిన విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. 60 యుద్ధనౌకలతోపాటు సబ్ మెరైన్స్‌, 50కిపైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటున్నాయి. దీనిలో భాగంగా భారత నౌకాదళ శక్తి (Naval Fleet Review) సామార్థ్యాలను రాష్ట్రపత్రి రామ్‌నాథ్ సమీక్షిస్తున్నారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 12వ ఎడిషన్ ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ విశాఖపట్నంలో జరుగుతోంది. 12వ ఎడిషన్ ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ సందర్భంగా ఈస్టర్న్ నేవల్ కమాండ్‌లో రాష్ట్రపతి 21-గన్-సెల్యూట్ అందుకున్నారు. అంతకుముందు నేవల్ డాక్‌యార్డ్‌కు చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సిబ్బంది గార్డ్ ఆఫ్ హానర్ అందించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు.

Also Read:

Goutham Reddy Death Live Updates: పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం

PM Narendra Modi: అలా అస్సలు చేయొద్దు.. బీజేపీ నేతకు వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోదీ.. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి..