
భారతదేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ.. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆగస్టు 14న సాయంత్రం 7 గంటలకు రాష్ట్రపతి ప్రసంగం ప్రారంభం కానుంది. దేశం సాధించిన విజయాలు, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్తు ఆకాంక్షలను ప్రతిబింబించేలా రాష్ట్రపతి సందేశం ఉండే అవకాశం ఉంది.
రాష్ట్రపతి ప్రసంగాన్ని ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో) జాతీయ నెట్వర్క్లో ప్రసారం చేయనున్నారు. అదే సమయంలో దూరదర్శన్కు చెందిన అన్ని ఛానెళ్లలో ప్రసంగాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేస్తారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు టెలివిజన్, రేడియోతో పాటు అధికారిక డిజిటల్ ప్లాట్ఫారమ్ల ద్వారా రాష్ట్రపతి సందేశాన్ని వీక్షించవచ్చు, వినవచ్చు. అధికారిక ప్రసార వివరాల ప్రకారం.. రాష్ట్రపతి ప్రసంగం మొదట హిందీ భాషలో, అనంతరం ఆంగ్లంలో ప్రసారం అవుతుంది. హిందీ, ఆంగ్ల ప్రసారాలు పూర్తైన తర్వాత దూరదర్శన్కు చెందిన ప్రాంతీయ ఛానెళ్లలో వివిధ ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేయనున్నారు. ఆకాశవాణి కూడా సంబంధిత ప్రాంతీయ నెట్వర్క్లలో అదే ప్రసంగానికి సంబంధించిన ప్రాంతీయ భాషా వెర్షన్లను రాత్రి 9.30 గంటలకు ప్రసారం చేయనుంది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని దూరదర్శన్, డీడీ న్యూస్, ఆకాశవాణి అధికారిక ప్రసార వేదికల్లో వీక్షించవచ్చు. అలాగే ప్రసార భారతి, దూరదర్శన్కు చెందిన అధికారిక డిజిటల్ ప్లాట్ఫారమ్లలోనూ ప్రసారం అందుబాటులో ఉంటుంది. ఆకాశవాణి జాతీయ నెట్వర్క్ ద్వారా రేడియోలో కూడా ప్రత్యక్ష ప్రసారం వినే అవకాశం ఉంటుంది. ప్రాంతీయ దూరదర్శన్ ఛానెళ్లు, ప్రాంతీయ ఆకాశవాణి నెట్వర్క్ల ద్వారా తర్వాత ప్రాంతీయ భాషల్లోనూ ప్రసంగాన్ని వినవచ్చు. అలాగే టీవీ9 తెలుగు న్యూస్ ఛానెల్లో సైతం ప్రసారం అందుబాటులో ఉంటుంది.